Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారు.. గుడ్ న్యూస్ చెప్పిన ఆరా మస్తాన్?

Pawan Kalyan: ఏపీ ఎన్నికలు మే 13వ తేదీ జరిగాయి. అయితే ఎప్పుడు రాని విధంగా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం భారీగా పెరిగింది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు మరొక రెండు రోజులలో రాబోతున్న నేపథ్యంలో అధికారం ఎవరిదనే విషయం గురించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

ఈ క్రమంలోనే పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుందని చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ప్రజానాడి ఈ పోల్ సర్వేలు కూడా సరైన స్థాయిలో పట్టు సాధించలేదని తెలుస్తోంది.

ఇకపోతే ఆరా మస్తాన్ సర్వే పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్తను తెలియజేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఈయన వెల్లడించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఉదయ్ కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు.

పవన్ గెలుపు ఖాయం..
అలాగే జనసేన పార్టీ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా ఆరా మస్తాన్ తన సర్వేలో వెల్లడించారు పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేశారని ఈయన తెలిపారు. ఈ సర్వేతో పాటు కేకే సర్వీస్ అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దే విజయం అని వెల్లడించడంతో జనసేన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.