Ap: అన్నా క్యాంటీన్లతో సమానంగా డొక్కా సీతమ్మ కాంటీన్లు .. పవన్ సంచలన వ్యాఖ్యలు!

Ap: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈయన పిఠాపురంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఆంధ్రప్రదేశ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఉభయగోదావరి జిల్లాలలో అన్నపూర్ణ దేవిగా ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా డొక్కా సీతమ్మ కాంటీన్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

డొక్కా సీతమ్మ సేవలను మనమంతా నిత్యం స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఇక దేశం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు..

డొక్కా సీతమ్మ…
ఇక తన ప్రాణం ఉన్నంతవరకు పిఠాపురం కోసం పని చేస్తానని తెలిపారు.. పిఠాపురం పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పుడే నేను నిజంగా గెలిచినట్టని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు..శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలంటే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ విషయంలోనూ తాను భయపడనని వెనకడుగు వేయనని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.