ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు అరెస్టు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో గతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హత్యకు పాల్పడిన మావోయస్టులు కూడా వారిలో ఉన్నారని సమాచారం.

ఏవోబిలో నక్సల్ అలజడి పెరుగుతుంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో నిఘా పెట్టిన విశాక పోలీసులు గురువారం ఆరుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.