లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ‘తాత మనవడు’ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. అయితే ఈ చిత్రం దాసరికి.. రాఘవకు తొలి సినిమా. 1973లో వచ్చిన ఈ సినిమాలో టైటిల్ రోల్స్ను ఎస్వీ రంగారావు, రాజబాబు పోషించారు. అయితే ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ రాజబాబు క్యారెక్టర్ను శోభన్బాబు చేయాల్సి ఉంది.
కానీ.. ఆ పాత్రను రాఘవ ఆఫర్ చేసినప్పుడు శోభన్బాబు చెయ్యనని చెప్పారంట. డైరెక్టర్ కొత్తవాడు కావడంతో సినిమాను వదులుకున్నాడంట. అంతేకాకుండా తనతో ఎక్స్పెరిమెంట్ చేయొద్దని కూడా అన్నారంట. మరో సినిమాను చేద్దాంలే అని ఆ సినిమా నుంచి తప్పించుకున్నాడంట. సినిమా పెద్ద హిట్ కావడంతో దాసరిని తక్కువ అంచనా వేసినందకు శోభన్ బాబు అప్పట్లో బాధపడ్డాడు.
ఆ తరువాత నుంచి దాసరి నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఎప్పుడూ వెంటనే కాదని చెప్పలేదంట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘బలిపీఠం’ బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత వచ్చిన ‘గోరింటాకు’ మరింత హిట్ తీసుకొచ్చింది.
ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిమన్యుడు, దీపారాధన, కృష్ణార్జునులు, స్వయంవరం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి చిత్రాలు వచ్చాయి. అప్పటి నుంచి ఏ సినిమాను కాదని అనకుండా ఎన్నో సినిమాలను చేశారు. ఇద్దరు ఒకరినొకరు “బావా బావా” అనుకునేంత సన్నిహితత్వంగా ఉండేవారు. వాళ్లిద్దరు సెట్ లో ఉంటే ఎంతో సరదాగా ఉండేవారు.
కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) సమస్య చాలా మందికి తరచూ ఎదురయ్యే జీర్ణ సమస్యల్లో ఒకటి. ఎక్కువగా తినడం, వేడి వాతావరణం,…
పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఇప్పటివరకు ఎక్కువగా జీర్ణవ్యవస్థ కోణంలోనే చర్చించేవారు.…
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…