పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో కోటి రూపాయిలు.. ఎలా అంటే?

కోటీశ్వరులు కావాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇది అందరి విషయంలోనూ నెరవేరదని భావిస్తుంటారు. కానీ పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలనే కలను నెరవేర్చుకోవచ్చు. అయితే ఇందుకు కొంత సుదీర్ఘ సమయం పడుతుంది. అదేవిధంగా ప్రతి రోజు మూడు వందల రూపాయలు మనం ఆదా చేసుకోగలిగితేనే కోటీశ్వరులు కావాలనే కల నెరవేరుతుంది.

ఇప్పటికే పోస్టాఫీసు ద్వారా ఎన్నో సేవింగ్ స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసుల్లో సేవింగ్స్ మనకు ఎప్పుడు ఏ ప్రమాదం కాదు.పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పీపీఎఫ్ కూడా ఒకటి. పీపీఎఫ్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు ఈ ఖాతాను తెరవచ్చు. ఈ స్కీమ్ పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తుంది. కొన్నిసార్లు వడ్డీ శాతం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మరికొన్నిసార్లు స్థిరంగా అయినా కూడా ఉండవచ్చు. అయితే ఈ స్కీమ్ ద్వారా సేవింగ్స్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కావాలంటే దీని కాలపరిమితి మనం పెంచుకోవచ్చు.ఈ స్కీమ్ ద్వారా ప్రతి రోజు మూడు వందల రూపాయలు ఆదా చేసుకొని నెలకు తొమ్మిది వేల రూపాయలను ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాలి.ఈ విధంగా 30 సంవత్సరాల పాటు ప్రతి నెల తొమ్మిది వేల చొప్పున జమ చేయడం వల్ల మీరు కోటీశ్వరులు కావాలనే కల నెరవేరుతుంది.