ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు దొరికినంత డబ్బులు దోచుకోవడం చూస్తున్నాము. చికిత్స పేరిట బాధితుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ లను మాస్క్లను శానిటైజర్ లను ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తూ నుంచి సొమ్ము చేసుకోవడం చూస్తున్నాము. కొన్నిచోట్ల బాధితుల ఒంటిపై ఉన్న బంగారు నగలు కూడా అపహరణ జరగడం గురించి విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ ముఠా కొత్తతరహా మోసానికి తెర లేపింది.
కరోనాతో మరణించిన వారి వంటిపై ఉన్న దుస్తులను స్మశాన వాటిక లలో దొంగలించి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి వాటిపై లేబుల్ లను అంటించి విక్రయాలను చేస్తుంటారు. ఈ విధమైన దొంగతనానికి పాల్పడిన ఏడుగురుని యూపీలోని బాగ్పట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా స్మశాన వాటికలో కరోనా బాధితులపై కప్పి ఉన్న ముసుగులు సహా, చీరలు, కుర్తాలు, బెడ్షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటి వరకు ఈ ముఠా కరోనా మృతదేహాల నుంచి సుమారు 520 బెడ్షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు దొంగిలించినట్లు వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడం విశేషం. ఈ విషయంపై వీటిని విచారించగా మరికొన్ని విషయాలను బయటపెట్టారు.
స్థానికంగా ఉండే కొందరు వ్యాపారులు వీరికి రోజుకు రూ.300 కూలి ఇచ్చి ఈ విధమైనటువంటి దొంగతనాలు చేయిస్తున్నట్లు కూడా నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ ఏడుగురిపై అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బాగ్పట్ పోలీసులు తెలిపారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…