దేశంలో అత్యంత చౌకైన 5జీ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉండడంతో కొత్త టెక్నాలజీతో ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటి ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ రియల్ మీ నార్జో 30 ప్రో 5 జీ ఫోన్లను కంపెనీ అత్యంత చౌకైన ధరలకు అందించనుంది.ఫ్లిప్ కార్ట్ కార్నివాల్ సేల్‌లో ఈ ఫోన్ల ధరలను తగ్గించారు. మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. అయితే ప్రస్తుతం ఈ ఫోన్లో పై మరింత తగ్గింపు లభిస్తుంది. మరింత ధరలు తగ్గించడంతో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.15,999కే అందుబాటులో ఉండనుంది. 

ఈ ఫోన్లో రెండు వేరియంట్ లు ఉన్నాయి.6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా ప్రస్తుతం ఈ సేల్స్ లో ఈ ఫోన్ ధర రూ.15,999లకే అందిస్తోంది. అదేవిధంగా మరొక వేరియంట్8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్స్ లో 18,999 రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లలో
స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ కలర్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది.ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. ఇక కెమెరాల విషయానికొస్తే మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ కాగా,8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఫ్రెండ్ కెమెరా కూడా 16 మెగా పిక్సల్ లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మందం 0. 91 సెం.మీ, బరువు 194 రాములు గా ఉంటుంది