V.N Aditya: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై ఫైర్ అయిన డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య.. అదే కారణమా?

V.N Aditya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాటిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కూడా ఒకటి. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే మరికొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రొడక్షన్ హౌస్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై డైరెక్టర్ వి ఎన్ ఆదిత్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్ బుక్ ద్వారా ఆయన సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో తాను మూడు సినిమాలు చేశాను అయితే ఈ సినిమా విడుదల కోసం నేను గత నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను.

నా సినిమాలు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ వాటి విడుదల విషయం గురించి పీపుల్ మీడియా వారు ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఎంతో పెద్ద పెద్ద సినిమాలను విడుదల చేసే పీపుల్స్ మీడియా వారు నా సినిమాల గురించి అర క్షణం ఆలోచించడం సరిపోతుందని నా సినిమాల విషయంలో సహనం కోల్పోవడంతోనే ఇలా అడగాల్సి వస్తుందని ఈయన తెలిపారు.

సహనం కోల్పోయాను..
ఇక వీ.ఎన్ ఆదిత్య పీపుల్స్ మీడియా వారితో చేసిన సినిమాల విషయానికి వస్తే మర్యాద కృష్ణయ్య, లవ్ @65, మీరెవరు వంటి మూడు సినిమాలను చేసినప్పటికీ ఇంకా విడుదల కాకపోవడంతో ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక పెద్ద నిర్మాణ సంస్థ గురించి డైరెక్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ ప్రభావం సదరు నిర్మాణ సంస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉండడమే కాకుండా నిర్మాణ సంస్థకు చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మరి ఈ విషయంపై పీపుల్స్ మీడియా వారు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.