Tag Archives: anand mahindra

Anand Mahindra: నాటు నాటు వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా…. ఇదే ఒరిజినల్ అంటూ ఫన్నీ ట్రోల్స్!

Anand Mahindra: రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.ఈ సినిమా దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటికీ ఎన్నో పురస్కారాలను అందుకోగా తాజాగా నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.

ఇక ఈ పాటకు గోల్డెన్ క్లబ్ అవార్డు రావడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో పాటలు, ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టకుంటున్నాయి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో నాటు నాటు ఒరిజినల్ సాంగ్ ఇదే అంటూ ఒక వీడియో వైరల్ గా మారింది.అయితే మరోసారి ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో ఈ పాట మరొక్కసారి వైరల్ అవుతుంది.

ఇద్దరు హాలీవుడ్ నటులు అచ్చం నాటు నాటు పాటలు రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన విధంగానే డాన్స్ చేయడంతో ఈ వీడియోని ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక్కడ ఏ పాట ఉందనే విషయం తెలియకపోయినా ఆ విజువల్ కినాటు నాటు ఆడియో యాడ్ చేశారు. దీంతో ఈ వీడియో ఆనంద్ మహేంద్ర కంటపడటంతో ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Anand Mahindra: ఆర్ఆర్ఆర్ హీరోల ఎనర్జీ ఉండకపోవచ్చు…

ఈ సినిమా విడుదలైన సమయంలో ఈ పాట వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. నాటు నాటు మేనియా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రలలో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ ఉండకపోయినా ఎంజాయ్ చేయండి అంటూ ఈయన ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ ఇదే ఒరిజినల్ నాటు నాటు సాంగ్ అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.

మొబైల్ ఫోన్ వాడుతూ ప్రమాదం.. ఆనంద్ మహీంద్రా ట్విట్?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ పక్కన లేకపోతే కనీసం నిద్ర కూడా పట్టడం లేదు. మరికొందరు సెల్ ఫోన్ చూస్తూనే వారి రోజు కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు.ఈ విధంగా నిత్యం సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలను గురించి మనం వినే ఉంటాం.

తాజాగా సెల్ ఫోన్ వాడకం గురించి భారతీయ పారిశ్రామికవేత్త మహేంద్ర ఆనంద్ అతిగా సెల్ ఫోన్ వాడటం వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఆనంద్ మహేంద్ర మాట్లాడుతూ ఒకసారి తను సెల్ ఫోన్ వాడుతూ ట్రావెల్ చేస్తున్నప్పుడు రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అప్పటి నుంచి తను ట్రావెల్ చేస్తున్నప్పుడు తన ఫోన్ తప్పనిసరిగా జోబులో పెట్టుకుంటానని తెలిపారు. ఈ విధంగా సెల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని ఈ సందర్భంగా వీడియోను పంచుకున్నందుకు ఎరిక్సోల్హీమ్‌కు ధన్యవాదాలు. అంటూ ఆనంద్‌ మహీంద్రా ఓ వీడియోస్ షేర్ చేశారు.

https://twitter.com/anandmahindra/status/1401864023969132545?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1401864023969132545%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fnational%2Fanand-mahindra-tells-us-why-should-not-use-our-phones-move-1369751

ప్రస్తుతం ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరు తమ సెల్ ఫోన్లలో లీనమై పోవడం వల్లే ప్రమాదానికి గురవుతుంటారు. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్ స్పందిస్తూ… ఊహించని ప్రమాదం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫీడ్ బ్యాక్ చూడగానే వాష్ రూమ్ కి వెళ్లానని తెలుపగా.. మరికొందరు గొప్ప సందేశం తెలిపారని కామెంట్లు చేస్తున్నారు.

కన్నీరు పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. కారణం తెలిస్తే?

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్లకు ఎంతో దగ్గరగా ఉంటారు. ఎప్పుడు ఫన్నీ వీడియోలను, తన అనుభవాలను షేర్ చేసే ఆనంద మహీంద్రా ఈసారి కూడా ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఆ వీడియోను చూసి కన్నీరు పెట్టుకున్నట్టు.. ఉదయమే ఎంతో బాధ కలిగించిందంటూ ట్విట్ చేశారు. ఎప్పుడు నవ్వుతు ఉండే ఆనంద్ మహీంద్రాను బాధ పెట్టిన వీడియో ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఈ నెల 25 కోసం ఏడాది అంత ఎదురు చూసేవారు ఎందరో ఉంటారు. ఇక మరో పది రోజుల్లో క్రిస్మస్ పండుగా వస్తుంది. అందుకే ఈ నెల ప్రారంభం నుంచే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యా. ఇక అలానే సోషల్ మీడియాలో కూడా క్రిస్మస్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయ్. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను చూశారు. ఆ వీడియోను చుసిన ఆనంద్ మహీంద్రా ఆ వీడియో చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు.

ఆ వీడియోలో ఏముంది అంటే.. 70 ఏళ్ళ వృద్ధుడు ఉదయాన్నే లేచి ప్రతిరోజు బరువులు ఎత్తి వ్యాయామాలు చేస్తుంటాడు. రోజుకు ఒక కేజీ బరువు ఎత్తుతుంటాడు. తనకు ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టుకొని, అందులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఒక 20 కేజీలు బరువు కలిగిన ఇనుప గుండును రోజూ ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. రోజురోజుకు ఆయన చేసే వ్యాయామాలను చూసి చుట్టుపక్కల వారు ఎందుకు ఇంత కష్ట పడుతున్నాడు అంటూ హేళన చేసేవారు. మరికొంతమంది జాలిగా చూసేవారు. ఆ చుట్టుపక్కల వారిలో ఒకరు ఆ వృద్ధుడు కూతురుకు ఫోన్ చేసి మీ నాన్నగారికి ఏదో అయ్యింది అన్నట్టు మాట్లాడుతారు. చివరికి తన కూతురు కూడా తన తండ్రిని అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ ఆ వృద్ధుడు మాత్రం చివరి వరకు ప్రయత్నించి అనుకున్న బరువును ఎత్తగలుగుతాడు.

ఆ తర్వాత చాలా అందంగా ముస్తాబై ఒక బహుమతి తీసుకొని, తన మనవరాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఒకరినొకరు చూసుకుని మురిసిపోతారు.తాతయ్యను చూసి ఎంతో ఆప్యాయంగా తాతగారి గుండెకు హత్తుకుంటుంది ఆ చిన్నారి పాప. ఆ వృద్ధుడు ఎంతో ఆనందపడిపోయి, తను తెచ్చిన బహుమతిని మనవరాలికి ఇచ్చి, అందులో ఉన్న స్టార్ ను తీసి,ఆమెని ఎత్తుకొని దానిని క్రిస్మస్ ట్రీ పైభాగంలో పెట్టిస్తాడు. ఇది చూసి ఆ వృద్ధుడి కూతురు కూడా కన్నీటి పర్యంతం అవుతుంది. ఆ మనవరాలిని ఎత్తుకోవడం కోసమే ఆ తాత రోజూ కష్టపడ్డాడని తెలుసుకుని నెటిజన్లు చలించిపోతారు. ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిని మహేంద్ర చూశారు. “మీరు నన్ను ఏడిపించారు. కానీ నాకు ఇంకా మనవరాలు లేదు. ఆ వయసు కలిగిన మనవడు మాత్రమే ఉన్నాడు” అంటూ మహేంద్ర ఉద్వేగానికిలోనై ట్విట్ చేశారు.