Tag Archives: Bank of Maharashtra

నిరుద్యోగులకు శుభవార్త.. ఆ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక స్వప్నం లాంటిది. దానిని సాకారం చేసుకోవాలంటే.. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దాని కోసం వివిధ నగరాలు, పట్టణాల్లో కోచింగ్ కూడా తీసుకుంటారు. ఇక బ్యాంక్ ఉద్యోగాలు అయితే కచ్చితంగా కోచింగ్ కు తీసుకోవాల్సిందే. వారి కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక శుభవార్తను తీసుకొచ్చింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఈ నెల 19 వరకు చివరితేదీగా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం పోస్టులు 190 ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో విభాగాల వారీగా చూస్తే.. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మినిస్టేటర్, ప్రొడక్ట్ సపోర్ట్ ఇజనీర్, నెట్ వర్క్ ఆండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్,
ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

వీటికి ఆయా పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలని పేర్కొన్నారు. వీటికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలన్నారు. ఆన్ లైన్ లో నిర్వహించే పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 100 ప్రశ్నలు ఉంటాయని.. వీటికి నెగెటివ్ మార్కులు లేదని పేర్కొన్నారు.

గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్..!

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. పండగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ను ప్రకటించింది. బంగారం రుణం తీసుకునే వారు ఏ బ్యాంకులో అయినా ప్రాసెసింగ్ ఫీజు అనేది వసూలు చేస్తుంటారు. కానీ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మాత్రం బంగారం, హౌసింగ్‌ లోన్స్‌ వంటి రుణాలపై విధించే ప్రాసెసింగ్‌ ఫీజులను తొలగించాలని నిర్ణయించింది.

ఇక నుంచి హౌసింగ్ లోన్ తీసుకునే సమయంలో కూడా ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇది దసరా కంటే ముందు అంటే సెప్టెంబర్ 30 నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీంతో కస్టమర్లకు ఎంతో కొంత ఉపశమనం కలగనుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలు, ప్రీపేమెంట్‌ పెనాల్టీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఇవ్వన్ని కూడా ఉండవని తెలిపారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకనటలో గృహ రుణంపై 6.90 శాతం వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అదే సమయంలో కారు రుణాలకు వడ్డీ రేటు 7.30 శాతంగా నిర్ణయించింది బ్యాంకు. బంగారు రుణ పథకంలో మార్పులు చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షల వరకు బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.10 శాతం. అదే సమయంలో రూ. లక్ష వరకు బంగారు రుణాల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకటనలో గృహ రుణంపై రెగ్యులర్‌గా ఈఎంఐ చెల్లించే వారు రెండు ఈఎంఐలపై డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపారు. ఖాతాను క్లోజ్ చేసే వారు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.