General News

గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్..!

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. పండగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ను ప్రకటించింది. బంగారం రుణం తీసుకునే వారు ఏ బ్యాంకులో అయినా ప్రాసెసింగ్ ఫీజు అనేది వసూలు చేస్తుంటారు. కానీ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మాత్రం బంగారం, హౌసింగ్‌ లోన్స్‌ వంటి రుణాలపై విధించే ప్రాసెసింగ్‌ ఫీజులను తొలగించాలని నిర్ణయించింది.

ఇక నుంచి హౌసింగ్ లోన్ తీసుకునే సమయంలో కూడా ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇది దసరా కంటే ముందు అంటే సెప్టెంబర్ 30 నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీంతో కస్టమర్లకు ఎంతో కొంత ఉపశమనం కలగనుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలు, ప్రీపేమెంట్‌ పెనాల్టీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఇవ్వన్ని కూడా ఉండవని తెలిపారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకనటలో గృహ రుణంపై 6.90 శాతం వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అదే సమయంలో కారు రుణాలకు వడ్డీ రేటు 7.30 శాతంగా నిర్ణయించింది బ్యాంకు. బంగారు రుణ పథకంలో మార్పులు చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షల వరకు బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.10 శాతం. అదే సమయంలో రూ. లక్ష వరకు బంగారు రుణాల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకటనలో గృహ రుణంపై రెగ్యులర్‌గా ఈఎంఐ చెల్లించే వారు రెండు ఈఎంఐలపై డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపారు. ఖాతాను క్లోజ్ చేసే వారు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

56 minutes ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

1 hour ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

1 hour ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

1 hour ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

1 hour ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

1 hour ago