Tag Archives: bihar man

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

Trending News: ఆ వ్యక్తికి 55 సంవత్సరాలు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా.. బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నొప్పి గత కొన్ని రోజులుగా ఉందని.. అతడు వైద్యుడికి చెప్పాడు. అస్సలు ఏమైందా అని వాళ్లు పరీక్షలు చేయగా.. షాక్ అయ్యారు.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

సీటీ స్కాన్ తీయగా.. కడుపులో ఉన్న ఆ వస్తువు చూసి వైద్యులే దిమ్మతిరిగిపోయారు. ఆ టెస్ట్‌ల్లో బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. దాంతోనే అతడికి కొడుపు నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పారు.

Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?

అసలు ఆ గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లింది.. అతడు దానిని చిన్న పిల్లల మాదిరిగా ఎలా మింగాడు.. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివవరాలు తెలుసుకుందాం..

ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం..


మడిపూర్ గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తికి సడన్ గా కడపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. వెంటనే పోతుందిలే అనుకున్నాడు. కానీ నొప్పి మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో అతడు.. వైద్యుడిని సంప్రదించగా.. పరీక్షల అనంతరం అతడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గమనించారు వైద్యులు. అది ఎలా మింగావని అడగ్గా.. అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ రోజు అతడు టీ తాగేటప్పుడు గ్లాస్ కూడా మింగేసినట్లు తెలిపాడు. అయితే టీ తాగుతుండగా గ్లాస్‌ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేవని వైద్యులు అంటున్నారు. అయితే తొలుత అతడికి ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆపరేషన్‌ చేసి గ్లాస్‌ ను తొలగించారు. దీంతో అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. గ్లాస్ ఆహార నాళంలో ఎలా పట్టిందో అర్థం కాక వైద్యులు తలలు పట్టుకుంటన్నారు. చిన్న పిల్లల మాదిరిగా గ్లాస్ మింగేయడం ఏంటి అంటూ.. గ్రామస్తులు గుసగుసలు ఆడుతున్నారు.

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ షాప్ యజమాని.. ఎలాగంటే?

అదృష్టం ఎటు నుంచి తలుపు తడుతుందో తెలియదు. అప్పడే మనం వాటిని అందుకోవాలి.. లేదంటే మరో సారి ఆ అవకాశం రాదు. ఏం చేసినా.. అదృష్టం ఉండాలి అని అంటుంటారు.. ఇది నిజమే. ఎంత కష్టం చేసినా కాస్తంత అదృష్టం ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేక పోతే ఎక్కడ నుంచి జీవితం మొదలు పెట్టామో అక్కడే ఉంటాం.

అయితే ఇలాంటి లక్ తో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. అతడికి లాటరీ తగిలింది అనుకుంటున్నారా.. కాదు.. అతడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.కోటి గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ అంటే ముఖ్యంగా డ్రీమ్ 11 గుర్తుకు వస్తుంది. దీనిలో పాల్గొనే వారు తనకంటూ ఉన్న 22 మంది టీమ్ సభ్యుల్లో 11 మందిని ఎంచుకొని అందులో బెట్టింగ్ పెడతారు.

ఇలా అతడు ప్రెడిక్ట్ చేసిన ఓ సెలూన్ షాప్ యజమానికి రూ.కోటి గెలుచుకున్నాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు ఈ అదృష్టం తట్టింది. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ కు ఓ సెలూన్ ఉంది. అతడికి తన జీవనాధారం ఆ సెలూన్ షాపే. డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ.కోటి అతనిని వరించాయి.

అతడికి క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ తో అతడు డ్రీమ్ 11 యాప్ లో ఎప్పుడూ బెట్టింగ్ పెడుతూ ఉంటాడట. కానీ ఎనాడు డబ్బులు గెలుచుకోలేదని.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పైనా బెట్టింగ్ పెట్టాడు. దీనిలోనే అతడు రూ.కోటి గెలుచుకున్నాడు. అయితే ఆ డబ్బులతో ఇల్లు కట్టుకొని.. మిగతా డబ్బులను అప్పు తీర్చుకుంటానని చెప్పాడు. అయితే తన వృత్తిని మాత్రం వదలనని చెప్పుకొచ్చాడు.

మానస హత్య కేసులో మరో మలుపు.. హత్యలో వేరొకరి ప్రమేయం..?

కేరళలోని కన్నూరు దగ్గర నెల్లికుళ్లిలో ఉన్న ఇందిరా గాంధీ డెంటల్ కాలేజీలో మానస అనే మహిళ హౌస్ సర్జన్‌గా పనిచేస్తోంది. 2 ఏళ్ల కిందట ఆమెకు రాఖిల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా కలిశాడు. వారి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అతడు ఆమెకు ప్రపోస్ చేశాడు కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుంచి అతని ప్రవర్తన మారింది. నువ్వు ఏ అబ్బాయిలతోనూ మాట్లాడొద్దు, ఎక్కువ సేపు మొబైల్ వాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దు అంటూ ఆధిపత్యం చూపించడం ప్రారంభించాడు. దీంతో మాసన అతన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. వేధింపుల ఎక్కువ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఇక నుంచి ఎలాంటి డిస్టబ్ చేయనంటూ చెప్పి వెళ్లడు. కానీ ఆమెపై మాత్రం పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో గత వారం ఆమె ఇంట్లోకి వెళ్లి కాల్చి చంపేశాడు. తదనంతరం అతడు కూడా కాల్చకొని చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరొకరి ప్రమేయమున్నట్లుగా తేల్చారు పోలీసులు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాఖిల్ కు తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందన్న అంశంపై ఎక్కువగా వివరాలను రాబడుతున్నారు. బీహార్‌లోని మంగేర్‌ జిల్లా ఖప్రతారా ఏరియాకు చెందిన 21ఏళ్ల సోను కుమార్ తన దగ్గర ఉన్న తుపాకీ ని రాఖిల్‌కి ఇచ్చినట్లు గుర్తించారు. కేరళకు చెందిన పోలీసులు బీహార్ పోలీసుల సహకారంతో అతడిని అరెస్టు చేశారు. సోను కుమార్ ను మంగేర్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. రాఖిల్ ఒక ఉబెర్‌ టాక్సీ డ్రైవర్‌ సాయంతో కేరళ నుంచి బిహార్ వెళ్లినట్లు తేల్చారు.

అక్కడ సోను దగ్గర నాటు తుపాకీ కొని కేరళలోని కొత్తమంగళంకు వచ్చి మానసకు దగ్గర్లోనే ఓ రూం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నుంచే మానసను ఎలా చంపాలనే ప్లాన్ వేశాడు. దీంతో పట్టపగలే ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్లి మానసను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఇక ఉబెర్ డ్రైవర్ ఎక్కడ ఉన్నడనే దానిపై ఆరా తీస్తున్నారు.