Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?
Trending News: ఆ వ్యక్తికి 55 సంవత్సరాలు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా.. బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నొప్పి గత కొన్ని రోజులుగా ఉందని.. అతడు వైద్యుడికి చెప్పాడు. అస్సలు ఏమైందా అని వాళ్లు పరీక్షలు చేయగా.. షాక్ అయ్యారు.
సీటీ స్కాన్ తీయగా.. కడుపులో ఉన్న ఆ వస్తువు చూసి వైద్యులే దిమ్మతిరిగిపోయారు. ఆ టెస్ట్ల్లో బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. దాంతోనే అతడికి కొడుపు నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పారు.
అసలు ఆ గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లింది.. అతడు దానిని చిన్న పిల్లల మాదిరిగా ఎలా మింగాడు.. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివవరాలు తెలుసుకుందాం..
మడిపూర్ గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తికి సడన్ గా కడపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. వెంటనే పోతుందిలే అనుకున్నాడు. కానీ నొప్పి మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో అతడు.. వైద్యుడిని సంప్రదించగా.. పరీక్షల అనంతరం అతడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గమనించారు వైద్యులు. అది ఎలా మింగావని అడగ్గా.. అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ రోజు అతడు టీ తాగేటప్పుడు గ్లాస్ కూడా మింగేసినట్లు తెలిపాడు. అయితే టీ తాగుతుండగా గ్లాస్ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేవని వైద్యులు అంటున్నారు. అయితే తొలుత అతడికి ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆపరేషన్ చేసి గ్లాస్ ను తొలగించారు. దీంతో అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. గ్లాస్ ఆహార నాళంలో ఎలా పట్టిందో అర్థం కాక వైద్యులు తలలు పట్టుకుంటన్నారు. చిన్న పిల్లల మాదిరిగా గ్లాస్ మింగేయడం ఏంటి అంటూ.. గ్రామస్తులు గుసగుసలు ఆడుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…