Trending News: ఇదెక్కడి వింత రా బాబు..! టీ తాగుతూ ఇలాంటి పని చేశాడేంటి..?
Trending News: ఆ వ్యక్తికి 55 సంవత్సరాలు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా.. బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నొప్పి గత కొన్ని రోజులుగా ఉందని.. అతడు వైద్యుడికి చెప్పాడు. అస్సలు ఏమైందా అని వాళ్లు పరీక్షలు చేయగా.. షాక్ అయ్యారు.
సీటీ స్కాన్ తీయగా.. కడుపులో ఉన్న ఆ వస్తువు చూసి వైద్యులే దిమ్మతిరిగిపోయారు. ఆ టెస్ట్ల్లో బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. దాంతోనే అతడికి కొడుపు నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు చెప్పారు.
అసలు ఆ గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లింది.. అతడు దానిని చిన్న పిల్లల మాదిరిగా ఎలా మింగాడు.. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివవరాలు తెలుసుకుందాం..
మడిపూర్ గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తికి సడన్ గా కడపు నొప్పి రావడం స్టార్ట్ అయింది. వెంటనే పోతుందిలే అనుకున్నాడు. కానీ నొప్పి మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో అతడు.. వైద్యుడిని సంప్రదించగా.. పరీక్షల అనంతరం అతడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గమనించారు వైద్యులు. అది ఎలా మింగావని అడగ్గా.. అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ రోజు అతడు టీ తాగేటప్పుడు గ్లాస్ కూడా మింగేసినట్లు తెలిపాడు. అయితే టీ తాగుతుండగా గ్లాస్ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేవని వైద్యులు అంటున్నారు. అయితే తొలుత అతడికి ఎండోస్కోపీ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆపరేషన్ చేసి గ్లాస్ ను తొలగించారు. దీంతో అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. గ్లాస్ ఆహార నాళంలో ఎలా పట్టిందో అర్థం కాక వైద్యులు తలలు పట్టుకుంటన్నారు. చిన్న పిల్లల మాదిరిగా గ్లాస్ మింగేయడం ఏంటి అంటూ.. గ్రామస్తులు గుసగుసలు ఆడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…