Tag Archives: central government jobs

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలనే వారికి ఈ ఉద్యోగాలు మంచి అవకాశమని చెప్పవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా సార్టింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, లోయర్ డివిజనల్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం ఉందని సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉండగా 200 మార్కులకు 100 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక్కో విభాగానికి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి.

ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వారు టైర్ 2 కు, టైర్ 2 పరీక్షలో ఎంపికైన వారికి టైర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం ఉద్యోగాలలో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, లోయన్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు 1538 ఉండగా సార్టింగ్‌ అసిస్టెంట్‌ లేదా పోస్టల్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు 3181 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా డిసెంబర్ 15, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

‘ :https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 12 నుంచి 27వ తేదీ వరకు టైర్ 1 పరీక్ష జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఇంటర్ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2021 సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే రెండు భాగాలు ఉంటాయి.

ఒకటి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కాగా రెండోది అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయడం. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సహాయంతో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫోటో, సంతకం అప్ లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఫీజును ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా చెల్లించే అవకాశం ఉంటుంది.

ఏపీలో పది పరీక్ష కేంద్రాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మూడు పరీక్ష కేంద్రాలను ఈ పరీక్షల కొరకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.