Featured

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలనే వారికి ఈ ఉద్యోగాలు మంచి అవకాశమని చెప్పవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా సార్టింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, లోయర్ డివిజనల్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం ఉందని సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉండగా 200 మార్కులకు 100 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక్కో విభాగానికి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి.

ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వారు టైర్ 2 కు, టైర్ 2 పరీక్షలో ఎంపికైన వారికి టైర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం ఉద్యోగాలలో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, లోయన్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు 1538 ఉండగా సార్టింగ్‌ అసిస్టెంట్‌ లేదా పోస్టల్‌ అసిస్టెంట్ ఉద్యోగాలు 3181 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా డిసెంబర్ 15, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

‘ :https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 12 నుంచి 27వ తేదీ వరకు టైర్ 1 పరీక్ష జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago