మనలో చాలామంది చిన్నచిన్న పొరపాట్ల వల్ల వేల రూపాయలు జరిమానా రూపంలో చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన తేదీలను, ఆ తేదీల లోపు చేయాల్సిన పనులను గుర్తుంచుకోవడం ద్వారా జరిమానా నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఆదాయపు పన్నును చెల్లించే వాళ్లు ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్నులు ఏదైనా కారణం వల్ల దాఖలు చేయడం సాధ్యం కాకపోతే ఏకంగా 10,000 రూపాయలు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశం ఉండటంతో ఖాతాదారులు జరిమానాపై అవగాహన కలిగి ఉండి జాగ్రత్త వహిస్తే మంచిది. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి తేదీగా ఉంది.
డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు 1,000 రూపాయలు ఆలస్య రుసుముగా, 5 లక్షల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లు 10,000 రూపాయలు ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు జరిమానాను ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో నిర్లక్ష్యం, ఆలసత్వం వహిస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఐటీఆర్ రిటర్నులు సబ్మిట్ చేస్తే జరిమానా భారం పడదు. మరో 22 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పన్ను చెల్లింపుదారులు అలర్ట్ గా ఉంటే మంచిది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…