మనలో చాలామంది చిన్నచిన్న పొరపాట్ల వల్ల వేల రూపాయలు జరిమానా రూపంలో చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన తేదీలను, ఆ తేదీల లోపు చేయాల్సిన పనులను గుర్తుంచుకోవడం ద్వారా జరిమానా నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఆదాయపు పన్నును చెల్లించే వాళ్లు ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్నులు ఏదైనా కారణం వల్ల దాఖలు చేయడం సాధ్యం కాకపోతే ఏకంగా 10,000 రూపాయలు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశం ఉండటంతో ఖాతాదారులు జరిమానాపై అవగాహన కలిగి ఉండి జాగ్రత్త వహిస్తే మంచిది. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి తేదీగా ఉంది.
డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు 1,000 రూపాయలు ఆలస్య రుసుముగా, 5 లక్షల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లు 10,000 రూపాయలు ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు జరిమానాను ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో నిర్లక్ష్యం, ఆలసత్వం వహిస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఐటీఆర్ రిటర్నులు సబ్మిట్ చేస్తే జరిమానా భారం పడదు. మరో 22 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పన్ను చెల్లింపుదారులు అలర్ట్ గా ఉంటే మంచిది.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…