మనలో చాలామంది చిన్నచిన్న పొరపాట్ల వల్ల వేల రూపాయలు జరిమానా రూపంలో చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన తేదీలను, ఆ తేదీల లోపు చేయాల్సిన పనులను గుర్తుంచుకోవడం ద్వారా జరిమానా నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఆదాయపు పన్నును చెల్లించే వాళ్లు ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిటర్నులు ఏదైనా కారణం వల్ల దాఖలు చేయడం సాధ్యం కాకపోతే ఏకంగా 10,000 రూపాయలు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో జరిమానా పడే అవకాశం ఉండటంతో ఖాతాదారులు జరిమానాపై అవగాహన కలిగి ఉండి జాగ్రత్త వహిస్తే మంచిది. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి తేదీగా ఉంది.
డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు 1,000 రూపాయలు ఆలస్య రుసుముగా, 5 లక్షల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లు 10,000 రూపాయలు ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు జరిమానాను ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో నిర్లక్ష్యం, ఆలసత్వం వహిస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఐటీఆర్ రిటర్నులు సబ్మిట్ చేస్తే జరిమానా భారం పడదు. మరో 22 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పన్ను చెల్లింపుదారులు అలర్ట్ గా ఉంటే మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…