Featured

రైలు ప్రయాణికులకు అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?

దేశంలో ఎక్కువమంది ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి రైళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే పలు సందర్భాల్లో రైల్వే శాఖ వేర్వేరు కారణాల వల్ల నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రయాణికులకు నిబంధనలపై అవగాహన ఉంటే ఇబ్బందులు లేవు కానీ అవగాహన లేకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. రైల్వే శాఖ ట్రైన్ టికెట్ బుకింగ్ విషయంలో కీలక మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

ఇకపై ప్రయాణ సమయంలో ప్రయాణికులు మొబైల్ నంబర్ ను ఖచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలి. రైలు ప్రయాణాలు తరచూ చేసేవాళ్లు ఈ నిబంధనపై అవగాహన కలిగి ఉంటే మంచిది. చాలామంది రైలు ప్రయాణికులు టికెట్లను సొంతంగా బుక్ చేసుకోకుండా వేర్వేరు కారణాల వల్ల ఏజెంట్ల సహాయంతో బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రయాణికులు ఇలా చేయడం వల్ల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రయాణికుల మొబైల్ నంబర్ రిజిష్టర్ కావడం లేదు.

మొబైల్ నంబర్ రిజిష్టర్ కాకపోవడం వల్ల రైల్వే శాఖ రైలు ప్రయాణానికి సంబంధించిన మెసేజ్ లను పంపుతున్నా ఆ మెసేజ్ లు ప్యాసింజర్లకు చేరడం లేదు. కొన్ని సందర్భాల్లో రైళ్లు క్యాన్సిల్ కావడం లేదా వేర్వేరు కారణాల వల్ల రైలు అనుకున్న సమయానికి రాదు. ఇలాంటి సమయంలో మన మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ద్వారా వివరాలు తెలుస్తాయి కాబట్టి ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేయడం సాధ్యం కాకపోతే 91 – 9881193322 నంబర్ కు వాట్సాప్ ద్వారా పీ.ఎన్.ఆర్ నంబర్ ను షేర్ చేసి రైలు ప్రయాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను సులభంగా పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

16 minutes ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

23 minutes ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

31 minutes ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

4 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

4 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

4 hours ago