దేశంలో ఎక్కువమంది ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి రైళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే పలు సందర్భాల్లో రైల్వే శాఖ వేర్వేరు కారణాల వల్ల నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రయాణికులకు నిబంధనలపై అవగాహన ఉంటే ఇబ్బందులు లేవు కానీ అవగాహన లేకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. రైల్వే శాఖ ట్రైన్ టికెట్ బుకింగ్ విషయంలో కీలక మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.
ఇకపై ప్రయాణ సమయంలో ప్రయాణికులు మొబైల్ నంబర్ ను ఖచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలి. రైలు ప్రయాణాలు తరచూ చేసేవాళ్లు ఈ నిబంధనపై అవగాహన కలిగి ఉంటే మంచిది. చాలామంది రైలు ప్రయాణికులు టికెట్లను సొంతంగా బుక్ చేసుకోకుండా వేర్వేరు కారణాల వల్ల ఏజెంట్ల సహాయంతో బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రయాణికులు ఇలా చేయడం వల్ల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రయాణికుల మొబైల్ నంబర్ రిజిష్టర్ కావడం లేదు.
మొబైల్ నంబర్ రిజిష్టర్ కాకపోవడం వల్ల రైల్వే శాఖ రైలు ప్రయాణానికి సంబంధించిన మెసేజ్ లను పంపుతున్నా ఆ మెసేజ్ లు ప్యాసింజర్లకు చేరడం లేదు. కొన్ని సందర్భాల్లో రైళ్లు క్యాన్సిల్ కావడం లేదా వేర్వేరు కారణాల వల్ల రైలు అనుకున్న సమయానికి రాదు. ఇలాంటి సమయంలో మన మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ద్వారా వివరాలు తెలుస్తాయి కాబట్టి ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేయడం సాధ్యం కాకపోతే 91 – 9881193322 నంబర్ కు వాట్సాప్ ద్వారా పీ.ఎన్.ఆర్ నంబర్ ను షేర్ చేసి రైలు ప్రయాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను సులభంగా పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…