Tag Archives: control

Pakisthan: పాకిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం..? ఈ పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?

Pakisthan: భారత్ కు పొరుగు దేశం అయిన పాకిస్తాన్ కు భారత్ కు మధ్య సరిహద్దు వివాదాలతో పాటు.. ఇతర రకాల వాగ్వాదాలు ఎప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి.. పాకిస్థాన్ ఇటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. పొరుగు దేశాలపై కాలుదువ్వుతూ కనిపిస్తోంది. ఇలా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ దేశ అభివృద్ధిని మరిచిపోయింది పాకిస్థాన్.

Pakisthan: పాకిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం..? ఈ పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం మన పొరుగు దేశం అయిన అప్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం నడుస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వాన్ని నిర్ధాక్షిణ్యంగా దింపేసి.. తాలిబన్లు తమ స్వరూపాన్ని చూపించారు. దీంతో ఆ రోజు నుంచి ఆ దేశ ప్రజలకు తిండిలేక అలమటిస్తున్నారు.

Pakisthan: పాకిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం..? ఈ పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?

తమ ఆహారం కోసం తమ కిడ్నీలకు అమ్ముకుంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి.. అక్కడి పాలను ఎంత దుర్భరంగా ఉందో. ఇలాంటి పాలనే పాకిస్థాన్ లో చోటు చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ప్రమాదకరంగా మారబోతోంది.


సైనికులను పిట్టల్లా కాల్చి చంపేసినా..

తెహరి తాలిబన్లు ఇటీవల పాకిస్థాన్ సైనికులను పిట్టల్లా కాల్చి చంపేశారు. ఇటువంటి చర్యలు జరుగుతున్నా అడిగే వాడే కరువయ్యాడు. ఇదే అదునుగా భావించిన తెహరి తాలిబన్లు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసిన జనరల్ హరి సింగ్ నల్వా కు గుర్తుగా హరి పూర్ లో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. దానిని పాకిస్థాన్ లోని మతోన్మాద శక్తులు ఆ విగ్రహాన్ని కూల్చివేసి..ఆ ప్రాంతం పేరును సాదిక్ అక్బర్ చౌక్ గా పెట్టారు. ఇదంతా జరుగుతున్నా.. పాకిస్థాన్ పీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో తాలిబన్ల పాలను ఇమ్రాన్ ఖాన్ కూడా స్వాగతం పలుకుతున్నారా.. అనే అనుమానాలకు తావిస్తోంది. ఇక ఏ క్షణమైనా పూర్తిగా పాకిస్థాన్ పై అమ ఆధిపత్యం చెలాయించేందుకు తెహరి తాలిబన్లు రెడీ గా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే అదుపులో ఉంచుకోవచ్చు..!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కనుగుణంగా ఆరోగ్యపరంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఎక్కువగా అన్నం తినడం ద్వారా ఎంతో మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి మధుమేహంబారిన పడిన వారు అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇలాంటి వారికి ఇది ఒక శుభవార్తే అని చెప్పవచ్చు.ఈ విధంగా అన్నం తయారుచేసుకుని తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే విధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం తినే అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కోసం ఒక పూట మాత్రమే అన్నం తీసుకోవడం, మిగిలిన సమయాలలో ఎక్కువగా చపాతి, రొట్టె వంటి వాటిని తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకున్నారు. శ్రీలంక దేశానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా అన్నంలో కేలరీలను సగానికి సగం తగ్గించే నూతన విధానాన్ని కనిపెట్టారు. ఇందులో భాగంగానే అన్నం తయారు చేసుకునేటప్పుడు అర కప్పు మరిగే నీటిలో మనం వంట కోసం ఉపయోగించే కొబ్బరి నూనెను వేయటం వల్ల అన్నంలో ఉన్న కేలరీలు సగానికి సగం తగ్గుతాయని కనుగొన్నారు. దీంతో మధుమేహంతో బాధపడేవారు అన్నం తిన్నప్పటికి కూడా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు.

సాధారణంగా మనం అన్నం తిన్నప్పుడు వెంటనే జీర్ణమవుతుంది అని మనకు తెలిసిందే. ఈ విధంగా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల శరీరంలో ఆహారం పది రెట్లు ఆలస్యంగా జీర్ణమవుతుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ విధంగా అన్నం చేసుకోవటం ద్వారా మధుమేహంతో బాధపడే వారు సైతం నిరభ్యంతరంగా అన్నం తినొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.