Tag Archives: corona devi

కరోనా దేవి నీలానే ఉందంటూ ఆ నటిపై కామెంట్స్.. ఆమె ఏం చేసిందంటే?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో తమిళనాడులో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో మాత్రం ఈ మహమ్మారిని అంతం చేయడం కోసం అక్కడి ప్రజలు కరోనా దేవతను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించి 48 రోజులపాటు భక్తిశ్రద్ధలతో హోమాలు నిర్వహించాలని భావించారు. ఈ విధంగా కరోనా దేవతకు పూజలు చేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులోని ప్రజలు కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ తమ క్రియేటివిటీని బయట పెడుతున్నారు.కరోనా దేవత ఫోటో చూసిన నెటిజన్లు కరోనా దేవత అచ్చం సినీనటి విజయ్ కుమార్ పోలికలతో ఉందని మీమ్స్ త‌యారు చేసి కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సినీనటి వనిత విజయ్ కుమార్ స్పందిస్తూ.. “ఓరి దేవుడా! ఇదేంటి ప్రతి ఒక్కరు ఈ ఫోటో తో పాటు మీమ్స్ పంపుతున్నారు” అంటూ నెటిజన్లు చేసే కామెంట్లపై వనిత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కరోనాకు దేవత విగ్రహ ప్రతిష్ట.. ప్రత్యేక పూజలు?

సాధారణంగా మనకు ఏదైనా ఆపదవచ్చినప్పుడు, లేదా కరువు ఏర్పడినప్పుడు వర్షాలు కురవాలని,అనావృష్టి పరిస్థితుల నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున తమ గ్రామ దేవతలకు పూజలు నిర్వహించడం, బలిదానాలు చేయడం వంటివి చూస్తుంటాము.ఈ విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని శాంతింప చేయడం వల్ల ఆ గ్రామంలోని ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తారు.

ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఎంతో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని, ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని వేడుకుంటూ కోయంబత్తూరులోని ఓ దేవస్థానం కరోనా దేవతను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు, మహాయాగం చేపట్టనుంది.తమిళనాడులోని కామాచ్చిపురి ఆధీనంలో ఇటువంటి భయంకరమైన వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడం కోసం విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం పూర్వం నుంచి ఒక ఆచారంగా వస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించనున్నట్లు కామాచ్చిపురం అధీనం ఇన్‌చార్జి శివలింగేశ్వర్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటం కోసమే 48 రోజుల పాటు కరోనా దేవతకు మహాయాగం చేస్తున్నట్లు ఈ యాగానికి భక్తులేవరిని అనుమతించడం లేదని శివ లింగేశ్వర్ తెలిపారు.

ప్రజలను భయాందోళనకు గురిచేసే వ్యాధులకు ఈ విధంగా ప్రత్యేక పూజలు హోమాలు చేయడం ఇది కొత్తేమీ కాదు, ఇదివరకే ఎంతో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు కోయంబత్తూరులోని ప్లేగు మారియమ్మన్ ఆలయమే నిర్మించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. గతంలో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్లేగు మారియమ్మన్ దేవతలను పూజించినట్లే ప్రస్తుతం కరోనా దేవతను ప్రతిష్టించి 48 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.