Tag Archives: corona third wave

భారత్ కి థర్డ్ వేవ్ ముప్పు.. ప్రజలు జాగ్రత్తలు పాటించలేదని నిపుణులు ఆందోళన!

దేశంలో కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో విజృంభించి దేశాన్ని.వణికించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు లక్షల్లో కేసులు నమోదవగా వేలల్లో మృత్యువాతపడ్డారు. అయితే ఇండియా ఇప్పుడిప్పుడే కరోనా రెండవ దశ నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో నిపుణులు భారత్ కి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో కరోనా రెండవ దశ పూర్తిగా తొలగి పోకముందే మూడవ దశ ప్రారంభం అవుతుందని ఆందోళనలో నిపుణులు ఉన్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ తొలగించారు ఈక్రమంలోనే ప్రజలు గుంపులు గుంపులుగా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.

మరి కొన్ని రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళ్లడమే కాకుండా అక్కడ కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరగడం వల్ల కరోనా మూడవ దశ వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ మరి కొద్ది రోజుల పాటు టూరిజం వాయిదా ఆ వేసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు.

ఈ దశలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రమాదమంటున్న నిపుణులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపించి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మూడో దశ వ్యాప్తి చెందుతుందని ఇది మరింత ప్రమాదకరంగా మారబోతుందని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తాజాగా రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ రమేష్‌ కంచర్ల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ గర్భిణీ మహిళ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వెంటిలేటర్ చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రెండవ దశ కరోనా తీవ్రత గర్భిణీ స్త్రీల పై పడటంతో వారు కోలుకోవడానికి కష్టమైందని మరి కొందరిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం వల్ల వారికి చికిత్స అందించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణీ స్త్రీలు శరీర బరువు పెరగడంతో పాటు వారిలో ఊపిరితిత్తుల ప్రక్రియ సక్రమంగా పనిచేయదు. ఈ క్రమంలోనే వారిలో ఆక్సిజన్ శాతం క్రమంగా తగ్గిపోతుందని వైద్య అధికారులు తెలిపారు.

కరోనా రెండవ దశలోనే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు మూడవ దశ వ్యాప్తి చెందితే మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వీరు హెచ్చరించారు. మూడవ దశ గర్భిణీలలో వ్యాపిస్తే సాధారణ వ్యక్తుల కంటే వీరు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కనుక తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

భారత్ లో థర్డ్ వేవ్ ఈ నెలలో వస్తుంది.. జాగ్రత్త అంటున్న నిపుణులు !

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపించి ఎంతో మంది యువకులను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది పసిపిల్లలు తల్లి తండ్రి లేని అనాధలుగా మిగిలిపోయారు. రెండవ దశ వ్యాపిస్తుందని నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే భారత్ భారీ మూల్యం చెల్లించింది అని తెలియజేశారు.

ఈ క్రమంలోనే రెండవదశ కరోనా భారతదేశంలో పూర్తిస్థాయిలో వ్యాపించి దేశాన్ని చిగురుటాకుల వణికించింది. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగం చేయటం వల్ల ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత మేర తగ్గుముఖం పట్టింది.

రెండవ దశ నుంచి కొంత ఉపశమనం పొందిన భారత్ కి నిపుణులు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థర్డ్ వేవ్ కరోనా రావడం తథ్యం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలియజేశారు. ఇండియాలో థర్డ్ వేవ్ సెప్టెంబర్-అక్టోబర్ నెల మధ్యలో రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

దేశంలో థర్డ్ వేవ్ వచ్చేలోగా వీలయినంత వరకు ప్రతి ఒక్కరు వేయించుకోవాలని, వ్యాక్సిన్ ఒకటే మన ముందున్న అస్త్రమనీ, నీతి అయోగ్ సభ్యులు తెలిపారు. రెండవ దశ కంటే మూడవ దశ మరింత తీవ్రతరంగా ఉండవచ్చని, ఈ వేరియంట్ ను ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.