2021 సంవత్సరం ప్రారంభమై 5 రోజులైంది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితులు మారతాయని సంతోషంతో, ఆరోగ్యంతో జీవనం సాగిస్తామని ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నెలలో డియర్నెస్ అలవెన్స్ ను పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 4 శాతం డియర్నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డియర్ నెస్ అలవెన్స్ పెరిగితే ఉద్యోగులు,వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2020 సంవత్సరం మార్చి నెలలో వేతనం పెంపు నిర్ణయం అమలు జరిగింది. నివేదికలు ఏడవ వేతన కమిషన్ సిఫార్సులను బట్టి వేతన పెంపు ఉంటుందని తెలిపాయి.
2020 సంవత్సరం జనవరి నెల నుంచే వేతన పెంపు అమలవుతుందని ప్రకటన వెలువడినా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల, డియర్నెస్ అలవెన్స్ పెంపు అమలులోకి రాలేదు. డియర్నెస్ అలవెన్స్ పెంపు లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. డీఏ పెంపు అమలైతే 65 లక్షల మన్డి పెన్షనర్లు, 48 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడవ వేతన సిఫార్సుల ను బట్టి డీఏ పెంపు అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో వేతన పెంపును ఎప్పటినుంచి అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.
కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలలు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సైతం కరోనా మహమ్మారి ప్రభావం పడింది. గతంతో పోలిస్తే కేంద్రానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా కేంద్రం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ ను నిలిపివేస్తున్నట్టు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. . సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రియల్ డియర్ నెస్ అలవెన్స్ వేతన మార్గదర్శకాలను అనుసరించి వేతనాలను చెల్లిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రం కీలక ప్రకటన చేసింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కరోనా విజృంభణ వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీ.పీ.ఎస్.ఈ ఉద్యోగుల డీఏలకు, అదనపు ఇన్స్టాల్మెంట్లకు ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్స్ మార్గదర్శకాలు అమలవుతాయని అందువల్ల డీఏ అదనపు చెల్లింపులు ఉండవని తెలిపింది. 2021 జులై నుంచి కేంద్రం డీఏ చెల్లించనుండగా ఎంతమొత్తం చెల్లించనుందో తెలియాల్సి ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే డీఏ పెంపు ఉండదని కీలక ప్రకటన చేసింది. కేంద్రం డీఏ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లపై పడటం గమనార్హం.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net