Tag Archives: decision

Cell Phone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదు..! కేంద్ర మంత్రి కీలక నిర్ణయం..!

Cell Phone Driving: ట్రాఫిక్ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా.. పోలీసులు ఫైన్ వేస్తారన్న విషయం తెలిసిందే. అన్నింటికంటే ఎక్కువగా ఫాలో అవుతున్న నియమం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.

Cell Phone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదు..! కేంద్ర మంత్రి కీలక నిర్ణయం..!

దీని వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో పాటు.. ఎన్నో అనర్థాలు కూడా చోటు చేసుకున్నాయి. అందుకే ఈ నిబంధనను ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నారు అధికారులు. ఈ ఉల్లంఘన వల్ల ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.

Cell Phone Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం కాదు..! కేంద్ర మంత్రి కీలక నిర్ణయం..!

అంతే కాదు.. వీటిపై విధించే ఫైన్లు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే తజాగా దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కారు డ్రైవింగ్ చేసే వారికి కీలక సూచనలు చేశారు.

కోర్టులో కూడా సవాల్ చేయొచ్చు..

డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడటం నేరం కాదని.. దానికి ఎలాంటి ఫైన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే దీనిపై మరికొంత క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ను చెవి దగ్గర కాకుండా.. బేబులో పెట్టుకోవాలని.. రెండు చేతులు స్టీరింగ్ పై మాత్రమే ఉండాలన్నారు. ఫోన్ ని జేబులో ఉంచుకొని.. మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికి ఎలాంటి ట్రాఫిక్ చలాన్లు విధించరన్నారు. ఇలా చేస్తున్న క్రమంలో ఎవరైనా చలాన్లు విధిస్తే.. వారిపై కోర్టులో సవాల్ చేయొచ్చని తెలిపారు. దీనిపై అత్యంత త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు మంత్రి.

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లు జారీ..!

Central Government: కేంద్రం త్వరలో పౌరులందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లను జారీ చేయడం ప్రారంభించనుంది . భారత్ పౌరుల కోసం త్వరలో నెక్స్ట్-జెన్ ఈ – పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఒక ట్వీట్‌లో తెలిపారు. బయోమెట్రిక్ డేటాతో పాస్‌పోర్ట్‌లు సురక్షితంగా ఉంటాయని .. ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని సంజయ్ భట్టాచార్య తెలిపారు.

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లు జారీ..!

ఈ పాస్ పోర్టులో మైక్రోచిప్ పాస్‌పోర్ట్.. బయోమెట్రిక్ డేటాకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం కలిగి ఉంటుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా అనధికారికి డేటా బదిలీని అనుమతించని భద్రతా లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. అప్‌గ్రేడ్ చేసిన డాక్యుమెంట్‌లు గుర్తించడం, దొంగతనం, ఫోర్జరీని అరికట్టడానికి.. స్ట్రీమ్‌లైన్డ్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం కనెక్టివిటీని మెరుగుపరచడానికి అమర్చబడి ఉంటాయన్నారు.

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లు జారీ..!

ఇక దీనిని ట్రయల్స్ లో భాగంగా.. అటువంటి చిప్‌లతో పొందుపరిచిన 20,000 అధికారులకు ఈ పాస్‌పోర్ట్‌లను జారీ చేసిందన్నారు. ఇవి విజయవంతంగా పనిచేస్తే.. ఇక పౌరులందరికీ ఇలాంటి పాస్ పోర్టులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పాస్ట్ పోర్టులు ప్రింటెడ్ బుక్‌లెట్ల రూపంలో జారీ చేయడం జరిగిందన్న సంగతి తెలిసిందే.

దరఖాస్తును ఇలా చేయండి..

ప్రస్తుతం కొత్తగా జారీ చేసే పాస్ పోర్టులు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలను అనుసరిస్తూ భద్రంగా ఉండనున్నాయి. ఇక ఈ పాస్ పోర్టులను ధ్వంసం చేయడం కష్టం అని కార్యదర్శి పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ ముందు భాగంలో ఉన్న చిప్ ఇ-పాస్‌పోర్ట్‌ల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లోగోతో వస్తుందని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశంలోని మొత్తం 36 పాస్‌పోర్ట్ కార్యాలయాలు ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు నివేదించబడిందన్నారు. వీటిని దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను ఫైల్ చేసి.. అపాయింట్‌మెంట్ తేదీని ఎంచుకోవడం లాంటివి అన్ని.. అంతక ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నారు.