Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్పోర్ట్లు జారీ..!
Central Government: కేంద్రం త్వరలో పౌరులందరికీ ఈ -పాస్పోర్ట్లను జారీ చేయడం ప్రారంభించనుంది . భారత్ పౌరుల కోసం త్వరలో నెక్స్ట్-జెన్ ఈ – పాస్పోర్ట్ను ప్రవేశపెట్టనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఒక ట్వీట్లో తెలిపారు. బయోమెట్రిక్ డేటాతో పాస్పోర్ట్లు సురక్షితంగా ఉంటాయని .. ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని సంజయ్ భట్టాచార్య తెలిపారు.
ఈ పాస్ పోర్టులో మైక్రోచిప్ పాస్పోర్ట్.. బయోమెట్రిక్ డేటాకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం కలిగి ఉంటుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా అనధికారికి డేటా బదిలీని అనుమతించని భద్రతా లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. అప్గ్రేడ్ చేసిన డాక్యుమెంట్లు గుర్తించడం, దొంగతనం, ఫోర్జరీని అరికట్టడానికి.. స్ట్రీమ్లైన్డ్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం కనెక్టివిటీని మెరుగుపరచడానికి అమర్చబడి ఉంటాయన్నారు.
ఇక దీనిని ట్రయల్స్ లో భాగంగా.. అటువంటి చిప్లతో పొందుపరిచిన 20,000 అధికారులకు ఈ పాస్పోర్ట్లను జారీ చేసిందన్నారు. ఇవి విజయవంతంగా పనిచేస్తే.. ఇక పౌరులందరికీ ఇలాంటి పాస్ పోర్టులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పాస్ట్ పోర్టులు ప్రింటెడ్ బుక్లెట్ల రూపంలో జారీ చేయడం జరిగిందన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొత్తగా జారీ చేసే పాస్ పోర్టులు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలను అనుసరిస్తూ భద్రంగా ఉండనున్నాయి. ఇక ఈ పాస్ పోర్టులను ధ్వంసం చేయడం కష్టం అని కార్యదర్శి పేర్కొన్నారు. పాస్పోర్ట్ ముందు భాగంలో ఉన్న చిప్ ఇ-పాస్పోర్ట్ల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లోగోతో వస్తుందని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశంలోని మొత్తం 36 పాస్పోర్ట్ కార్యాలయాలు ఇ-పాస్పోర్ట్లను జారీ చేయనున్నట్లు నివేదించబడిందన్నారు. వీటిని దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు ఫారమ్ను ఫైల్ చేసి.. అపాయింట్మెంట్ తేదీని ఎంచుకోవడం లాంటివి అన్ని.. అంతక ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…