Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్పోర్ట్లు జారీ..!
Central Government: కేంద్రం త్వరలో పౌరులందరికీ ఈ -పాస్పోర్ట్లను జారీ చేయడం ప్రారంభించనుంది . భారత్ పౌరుల కోసం త్వరలో నెక్స్ట్-జెన్ ఈ – పాస్పోర్ట్ను ప్రవేశపెట్టనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఒక ట్వీట్లో తెలిపారు. బయోమెట్రిక్ డేటాతో పాస్పోర్ట్లు సురక్షితంగా ఉంటాయని .. ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని సంజయ్ భట్టాచార్య తెలిపారు.
ఈ పాస్ పోర్టులో మైక్రోచిప్ పాస్పోర్ట్.. బయోమెట్రిక్ డేటాకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం కలిగి ఉంటుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా అనధికారికి డేటా బదిలీని అనుమతించని భద్రతా లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. అప్గ్రేడ్ చేసిన డాక్యుమెంట్లు గుర్తించడం, దొంగతనం, ఫోర్జరీని అరికట్టడానికి.. స్ట్రీమ్లైన్డ్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం కనెక్టివిటీని మెరుగుపరచడానికి అమర్చబడి ఉంటాయన్నారు.
ఇక దీనిని ట్రయల్స్ లో భాగంగా.. అటువంటి చిప్లతో పొందుపరిచిన 20,000 అధికారులకు ఈ పాస్పోర్ట్లను జారీ చేసిందన్నారు. ఇవి విజయవంతంగా పనిచేస్తే.. ఇక పౌరులందరికీ ఇలాంటి పాస్ పోర్టులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పాస్ట్ పోర్టులు ప్రింటెడ్ బుక్లెట్ల రూపంలో జారీ చేయడం జరిగిందన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొత్తగా జారీ చేసే పాస్ పోర్టులు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలను అనుసరిస్తూ భద్రంగా ఉండనున్నాయి. ఇక ఈ పాస్ పోర్టులను ధ్వంసం చేయడం కష్టం అని కార్యదర్శి పేర్కొన్నారు. పాస్పోర్ట్ ముందు భాగంలో ఉన్న చిప్ ఇ-పాస్పోర్ట్ల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లోగోతో వస్తుందని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశంలోని మొత్తం 36 పాస్పోర్ట్ కార్యాలయాలు ఇ-పాస్పోర్ట్లను జారీ చేయనున్నట్లు నివేదించబడిందన్నారు. వీటిని దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు ఫారమ్ను ఫైల్ చేసి.. అపాయింట్మెంట్ తేదీని ఎంచుకోవడం లాంటివి అన్ని.. అంతక ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…