Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచులక్ష్మి.. అలాంటివి ఉంటే చెప్పండంటూ… ట్వీట్!
Manchu Lakshmi: చైనాలో మొదలైన కరోనా… రెండేళ్లుగా ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాలు కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఆల్ఫా, బీటీ, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మారుస్తూ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం ఓమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.
ఇండియాలో కూడా ఇటీవల కాలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజుకు కేవలం 10 వేలకు తక్కువగానే ఉన్న కరోనా కేసులు ఇటీవల లక్షకు చేరాయి. వారం వ్యవధిలోనే పరిస్థితి తారు మారైంది.
ఇదిలా ఉంటే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సౌరవ్ గంగూలీతో పాటు ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు మరికొంత మంది ఎంపీలు, పలు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు.
తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే మంచు మనోజ్ కరోనా నుంచి కోలుకోగా.. మంచు లక్ష్మీ కూడా కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాదాపు రెండేళ్ల నుంచి బూచోడు నుంచి తప్పించుకుంటున్నాను.. అయినా దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా.. అందుకే నన్ను విడిచిపెట్టలేదని అంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించా అంది. నాకున్న కలరీ స్కిల్స్ తో దాన్ని ఎలాగైనా పంపిస్తా అని అంది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ ప్రజలకు పలు సూచనలు కూడా చేసింది. ఇంట్లోనే ఉండండి, ఖచ్చితంగా మాస్క్ ధరించండి. రెండు డోసులు టీకాను తీసుకోండి, ఒక వేళ వీలయితే బూస్టర్ డోస్ తీసుకోండంటూ ప్రజలకు సూచించింది. అలాగే టైమ్ పాస్ కోసం టాప్ 3 మూవీస్, షోలు, పాడ్కాస్ట్లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…