Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచులక్ష్మి.. అలాంటివి ఉంటే చెప్పండంటూ… ట్వీట్!
Manchu Lakshmi: చైనాలో మొదలైన కరోనా… రెండేళ్లుగా ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాలు కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఆల్ఫా, బీటీ, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మారుస్తూ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం ఓమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.
ఇండియాలో కూడా ఇటీవల కాలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజుకు కేవలం 10 వేలకు తక్కువగానే ఉన్న కరోనా కేసులు ఇటీవల లక్షకు చేరాయి. వారం వ్యవధిలోనే పరిస్థితి తారు మారైంది.
ఇదిలా ఉంటే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సౌరవ్ గంగూలీతో పాటు ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు మరికొంత మంది ఎంపీలు, పలు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు.
తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే మంచు మనోజ్ కరోనా నుంచి కోలుకోగా.. మంచు లక్ష్మీ కూడా కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాదాపు రెండేళ్ల నుంచి బూచోడు నుంచి తప్పించుకుంటున్నాను.. అయినా దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా.. అందుకే నన్ను విడిచిపెట్టలేదని అంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించా అంది. నాకున్న కలరీ స్కిల్స్ తో దాన్ని ఎలాగైనా పంపిస్తా అని అంది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ ప్రజలకు పలు సూచనలు కూడా చేసింది. ఇంట్లోనే ఉండండి, ఖచ్చితంగా మాస్క్ ధరించండి. రెండు డోసులు టీకాను తీసుకోండి, ఒక వేళ వీలయితే బూస్టర్ డోస్ తీసుకోండంటూ ప్రజలకు సూచించింది. అలాగే టైమ్ పాస్ కోసం టాప్ 3 మూవీస్, షోలు, పాడ్కాస్ట్లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…