Tag Archives: exams

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

Tenth Class: పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ విద్యాశాఖ. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రము ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

పదో తరగతి విద్యార్థులకు గతంలో పేపర్ 1, పేపర్ 2గా మొత్తం 11 ప్రశ్నా పత్రాలు ఉండేవి. అయితే కోవిడ్ ప్రభావంతో ఈసారి ఆరు పేపర్లకే కుదించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

ఈసారి కూడా చాలా ఆలస్యంగానే విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఇదే కాకుండా థర్డ్ వేవ్ కారణంగా ఇటీవల కొన్ని రోజులు స్కూళ్లు మూతపడ్డాయి.  ఇదిలా ఉంటే ఈసారి ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లను సింగిల్ పేపర్లకే పరిమితం చేస్తున్నామని పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు.

ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని ఆదేశాలు..

ఫస్ట్ లాంగ్వేజ్ తో పాటు మిగతా సబ్జెక్ట్ ల పేపర్లను సింగిల్ పేపర్లకు పరిమితం చేశారు. మొత్తం వంద మార్కులకు జరిగే ఈ పరీక్షల్లో 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్స్ కాగా…20 మార్కులు ఇంటర్నల్స్ మార్కులు ఉంటాయని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో రెగ్యులర్, ఓపెన్ టెన్త్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను తప్పులు లేకుండా తీసుకోవాలని, ఆన్ లైన్ డాటా సేకరణలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. కాగా.. గతంలో కొన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గడువు తేదీలు ముగిసినా కూడా రెండు, మూడు నెలలకు మన్యూ స్ట్రిప్ట్ నామినల్ రోల్స్(ఎంఎన్ఆర్) ను సమర్పిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని… ఈసారి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈసారి ఆలస్యం అయితే.. ఆలస్య రుసుము తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల వారీగా విద్యాశాఖాధికారులు కార్యాయాలయాల్లో చలానాతో పాటు ఎంఎన్ఆర్ లను గడువులోగా సమర్పించాలని.. అందకపోతే తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

10th Class Exams: పదో తరగతి విద్యార్థులు అలర్ట్..!. ఆ నెల చివరలో పరీక్షలు నిర్వహణ.. !

10th Class Exams: గత రెండేళ్ల నుంచి కోవిడ్ కారణంగా చదువులు అటకెక్కాయి. కేవలం ఆన్ లైన్ చదువులతోనే విద్యార్థులు కాలం వెళ్లదీశారు. వరసగా కరోనా వేవ్ లు, లాక్ డౌన్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల విద్యా సంవత్సారాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన స్కూళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

10th Class Exams: పదో తరగతి విద్యార్థులు అలర్ట్..!. ఆ నెల చివరలో పరీక్షలు నిర్వహణ.. !

అయితే ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి ఎప్రిల్ చివర్లో కానీ మేలో కానీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎస్ఎస్సీ బోర్డ్ కసరత్తును ప్రారంభించింది. కరోనా కారణంగా 2021-22 విద్యా సంవత్సరాన్ని చాలా ఆలస్యంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

10th Class Exams: పదో తరగతి విద్యార్థులు అలర్ట్..!. ఆ నెల చివరలో పరీక్షలు నిర్వహణ.. !

జూన్ 12 నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా…అక్టోబర్ వరకు తరగతులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన క్యాలెండర్ ను సవరించింది. అకడమిక్ ఇయర్ ఎప్రిల్ 30 వరకు కొనసాగించేలా క్యాలెండర్ ని సవరించింది. ఈ సమయంలోనే సిలబస పూర్తయ్యేలా కొన్ని పాఠ్యాంశాలను కూడా తగ్గించింది. పదో తరగతి సిలబస్ ను మార్చి 31 కల్లా పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది. 

టెన్త్ పరీక్షల కోసం ఫీజు గడువును ..

దీంతో పదో తరగతి విద్యార్థలు పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా రివిజన్ చేయించనున్నారు. ఫ్రీ ఫైనల్ నిర్వహించిన తర్వాత.. ఏప్రిల్ ఆఖరు లేదా మే నెల తొలివారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరోపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్రిల్ నెలలో జరుగనున్నాయి. వీటి నిర్వహణ అనంతరం టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. టెన్త్ పరీక్షల కోసం ఫీజు గడువును మరోసారి పొడగించింది ఎస్సెస్సీ బోర్డ్. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి మంగళ వారం ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 వరకు ఇదివరకు తుది గడువుగా నిర్ణయించగా.. తాజాగా దాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించారు.