10th Class Exams: పదో తరగతి విద్యార్థులు అలర్ట్..!. ఆ నెల చివరలో పరీక్షలు నిర్వహణ.. !
10th Class Exams: గత రెండేళ్ల నుంచి కోవిడ్ కారణంగా చదువులు అటకెక్కాయి. కేవలం ఆన్ లైన్ చదువులతోనే విద్యార్థులు కాలం వెళ్లదీశారు. వరసగా కరోనా వేవ్ లు, లాక్ డౌన్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థుల విద్యా సంవత్సారాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన స్కూళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.
అయితే ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి ఎప్రిల్ చివర్లో కానీ మేలో కానీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎస్ఎస్సీ బోర్డ్ కసరత్తును ప్రారంభించింది. కరోనా కారణంగా 2021-22 విద్యా సంవత్సరాన్ని చాలా ఆలస్యంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
జూన్ 12 నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా…అక్టోబర్ వరకు తరగతులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన క్యాలెండర్ ను సవరించింది. అకడమిక్ ఇయర్ ఎప్రిల్ 30 వరకు కొనసాగించేలా క్యాలెండర్ ని సవరించింది. ఈ సమయంలోనే సిలబస పూర్తయ్యేలా కొన్ని పాఠ్యాంశాలను కూడా తగ్గించింది. పదో తరగతి సిలబస్ ను మార్చి 31 కల్లా పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది.
దీంతో పదో తరగతి విద్యార్థలు పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా రివిజన్ చేయించనున్నారు. ఫ్రీ ఫైనల్ నిర్వహించిన తర్వాత.. ఏప్రిల్ ఆఖరు లేదా మే నెల తొలివారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరోపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్రిల్ నెలలో జరుగనున్నాయి. వీటి నిర్వహణ అనంతరం టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. టెన్త్ పరీక్షల కోసం ఫీజు గడువును మరోసారి పొడగించింది ఎస్సెస్సీ బోర్డ్. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి మంగళ వారం ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 వరకు ఇదివరకు తుది గడువుగా నిర్ణయించగా.. తాజాగా దాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…