Tag Archives: flight

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ కి కోపం తెప్పించిన ప్యాసింజర్… చేయి చేసుకున్న మైక్ టైసన్… వీడియో వైరల్!

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనకు సినిమాల పరంగా మాత్రమే కాకుండా ఎంతమంది అభిమానులు ఉన్నారు.

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ కి కోపం తెప్పించిన ప్యాసింజర్… చేయి చేసుకున్న మైక్ టైసన్… వీడియో వైరల్!

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా బయట కనపడితే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. కనీసం వారితో ఒక్కసారి మాట్లాడి సెల్ఫీ తీసుకోవాలని భావిస్తారు. మైక్ టైసన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్‌ విమానంలో వెళ్తుండగా ఆయన వెనక సీటులో ఉన్న అభిమాని తనని గుర్తించి తనతో మాట కలిపారు.

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ కి కోపం తెప్పించిన ప్యాసింజర్… చేయి చేసుకున్న మైక్ టైసన్… వీడియో వైరల్!

ఈ విధంగా సదరు ప్యాసింజర్ మైక్ టైసన్ ను వదలకుండా తనతో మాట్లాడుతూ తన సహనాన్ని పరీక్షించారు.అక్కడికి మైక్ టైసన్ కాసేపు గమ్మున కూర్చోమని తనకు చెప్పినప్పటికీ వినకుండా ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ విసిగించాడు. ఇక ఆ ప్యాసింజర్ ప్రశ్నలకు విసుగుచెందిన మైక్ టైసన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ప్యాసింజర్ పై చేయి చేసుకున్నారు.

బాక్సింగ్ కోచ్…

ఈ విధంగా తనని విసిగించడంతో వెనక్కి వెళ్లి ఆ ప్యాసింజర్ పై పిడుగుద్దుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బాక్సింగ్ కోచ్ గా ఈయన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Aeroplane: విమానం మబ్బుల్లో ఎలా ముందుకు వెళ్తుంది..! కారణం ఏమిటో తెలుసా?

Aeroplane: చాలా మందికి విమానాలు ఎలా పనిచేస్తాయనే డౌట్.. వాటి దారి ఎలా తెలుస్తుందని, ఎలా గమ్యస్థానాలకు చేరుకుంటాయనే సందేహాలు వస్తుంటాయి. భూమిపై అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా విమానాలు తమ గమ్యస్థానాలకు చేరుతుంటాయి.

భూమిపైన ఉన్న ప్రతీ విమానాశ్రయం కోఆర్డినేట్స్ ఫ్లైట్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయి ఉంటాయి. డెస్టినేషన్ మ్యాప్ తో ఫైలెట్ వెళ్లి తను వెళ్లాల్సిన ప్రాంతం యెక్క డెస్టినేషన్ కోడ్ ఎంటర్ చేసి హెచ్ఎస్ఐ సాయంతో అక్కడికి చేరకుంటాడు.

కెప్టెన్ తన కంప్యూటర్ లో డెస్టినేషన్ డేటా పూరించడంతో రెండు త్రిభుజాలు ఏర్పడుతాయి. ఆ తర్వాత గమ్యస్థానం ఎక్కడుందో కంప్యూటర్లు నమోదు చేస్తారు.ఇలా కంప్యూటర్లు విమానం వెళ్లాల్సిన మార్గాన్ని నిర్థేశించుకుంటుంది. ఈ మార్గాలు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తయారవుతాయి.

ఫైలెట్లు సంప్రదింపులు జరుపుతూ..


పర్వతాలు, సముద్రమార్గాలు, గాలులు, వాతావరణం ఇతర దేశాల సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని విమానం ఎగరడానికి మార్గాలను రూపొందిస్తారు.  ఇదిలా ఉంటే ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల విమానాలకు దిశా నిర్థేశం చేయడానికి కీలకంగా ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ).. విమానం ఎత్తు, వెళ్లాల్సిన మార్గం గురించి ఎప్పటికప్పుడు ఫైలెట్లు సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. విమానం వెళ్తున్న మార్గాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో ఉండే ఏటీసీలు విమానాలకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటారు. విమానం వెళ్లే మార్గంలో ఇతర విమానాలు కూడా ప్రయాణిస్తుంటాయి. దీంతో ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదాలు కూడా ఉంటాయి. దీంతో ఏటీసీ ఎప్పటికప్పుడు.. కీలక ఆదేశాలు ఇస్తూ ఉంటుంది.

ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం.. గాల్లోనే గంటపాటు తిరిగిన విమానం.. చివరకు ఏమైందంటే?

నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. ఎమ్మెల్యే రోజా రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉండగా.. ఈరోజు ఉదయం 10:55 గంటలకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆమె ఎక్కారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వేగంగా స్పందించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉండగా, విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాము ఇంకా విమానంలోనే ఉన్నామని, ఇంకా విమానం తలుపులు తెరవలేదని ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైలట్‌కు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు అని రోజా వీడియో విడుదల చేశారు. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో విమానం గంటకు పైగా గాలిలో తిరుగుతోందని ఆమె వీడియో ద్వారా వార్తను పంచుకున్నారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. మరోవైపు ఈ విమానం తిరుపతికి తిరిగి వస్తుందా లేదా అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే తో పాటు ఇతర ప్రయాణీకులు ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి దిగడానికి అనుమతించారని .. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ల్యాండింగ్‌కు అనుమతి లేనందున విమానం దిగేందుకు రూ. 5,000 చెల్లించాలని ఇండిగో అధికారులు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఊపిరాడక విమానంలో కూర్చోలేక ఆమెతో సహా కొందరు డబ్బులు చెల్లించారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేయాలని చెప్పారన్నారు. ఆమెతో పాటు మిగిలిన ప్రయాణికులు ఈ వ్యవహారంపై సివిల్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.