General News

ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం.. గాల్లోనే గంటపాటు తిరిగిన విమానం.. చివరకు ఏమైందంటే?

నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. ఎమ్మెల్యే రోజా రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉండగా.. ఈరోజు ఉదయం 10:55 గంటలకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆమె ఎక్కారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వేగంగా స్పందించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉండగా, విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాము ఇంకా విమానంలోనే ఉన్నామని, ఇంకా విమానం తలుపులు తెరవలేదని ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైలట్‌కు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు అని రోజా వీడియో విడుదల చేశారు. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో విమానం గంటకు పైగా గాలిలో తిరుగుతోందని ఆమె వీడియో ద్వారా వార్తను పంచుకున్నారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. మరోవైపు ఈ విమానం తిరుపతికి తిరిగి వస్తుందా లేదా అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే తో పాటు ఇతర ప్రయాణీకులు ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి దిగడానికి అనుమతించారని .. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ల్యాండింగ్‌కు అనుమతి లేనందున విమానం దిగేందుకు రూ. 5,000 చెల్లించాలని ఇండిగో అధికారులు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఊపిరాడక విమానంలో కూర్చోలేక ఆమెతో సహా కొందరు డబ్బులు చెల్లించారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేయాలని చెప్పారన్నారు. ఆమెతో పాటు మిగిలిన ప్రయాణికులు ఈ వ్యవహారంపై సివిల్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

6 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

7 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

15 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago