Tag Archives: girl rape

బాలికపై వృద్ధుడి అత్యాచారం.. విషయం బయటకు రావడంతో..ఇలా!

ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల్లో మాత్రం బయం లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా కనిపడితే చాలు.. మగవాళ్ల కళ్లు కామంతో మూసుకుని పోతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు..

దీంతో తన కోసమే వచ్చినట్టుగా మహిళలపై లైంగికదాడి చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.. అయితే చివరికి అత్యాచార నిందితులకు చావే శరణ్యం అవుతున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక సీఐ తెలిపిన వివరాల ప్రకారం…

హన్మకొండ జిల్లా వడ్డేపల్లి పరిమళకాలనీకి చెందిన 69 ఏళ్ల భిక్షపతి విద్యా సంస్థలో సూపింటెండెంట్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. అతడి ఇంటి పక్కనే ఓ దివ్యంగుడు ఉంటున్నాడు. అతడికి ఓ కూతురు ఉంది. ఈ మధ్య ఆమె తల్లి పుట్టింటికి వెళ్లింది. వారిద్దరి మధ్య కలహాలు రావడంతో ఆమె తన తండ్రికి దూరంగా ఉంటుంది. దీంతో ఆ బాలికకు అన్నీ తానై చూసుకుంటున్నాడు.

దీనినే అదునుగా భావించిన ఆ వృద్ధుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమెను ఆ దివ్యాంగులు ఏమైదంని అడగ్గా.. విషయం చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారం.. చివరకు ఆమె గర్భం దాల్చడంతో..

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అత్యాచారంలో తన బంధువుతో పాటు మరో నలుగురు ఉన్నారు. దీంతో ఆమె ఆ బిడ్డను బావిలో ఆ బాలిక బంధువు పడేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కామాంధులు రెచ్చిపోతున్నారు.

వాయి వరసులు మరిచి అయిన వాళ్లపై కూడా ఏ మాత్రం కనికరంలేకుండా అత్యాచారాలకు పాల్పడతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్రామానికి చెందిన ఓ బాలిక(14) తల్లి మూడేళ్ల క్రితమే మరణించింది. ఉపాధి కోసం ఆ బాలిక తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంటున్న విషయాన్ని ఆమె సమీప బంధువు(21) గమనించాడు.

ఇది గమనించి ఆమెపై 8 నెలల క్రితం అత్యాచారం చేశాడు. అతడికి సంబంధించి మరో నలుగురు స్నేహితులు కూడా.. ఈ విషయాన్ని తాము మీ నాన్నకు చెబుతాం అంటూ బెదిరించి .. అత్యాచారం చేశారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల ఆమె గర్భం దాల్చిన విషయం వాళ్లకు తెలవడంతో టాబ్ లెట్స్ ఇచ్చి ఆ గర్భాన్ని పోగొట్టాలని చూశారు. తీవ్ర నొప్పితో ఆమె రక్తస్రావం అయి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికను తమ సమీప బంధువు బావిలో పడేశాడు.

బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట బాలికను అదుపులోకి తీసుకొని విచారంచగా.. ఆమె జరిగినది అంతా చెప్పింది. ఆమెను అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడిని..అతడి స్నేహితుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను, అందులో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా.. వైఎస్ షర్మిల

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆరేళ్ల చిన్నారి చైత్రను రాజు అనే దుండగుడు ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటు సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రతీ ఒక్కరు గాలిస్తున్నారు.

ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ పోలీసులు రూ.10 లక్షలు రివార్డు కూడా ఇస్తానని ప్రకటించారు. దానికి సంబంధించి నిందితుడి ఫొటో, ఆనవాళ్లను కూడా షేర్ చేశారు. ఇప్పటికే అతడి ఫొటో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, మీడియాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిపోయింది. కానీ అతడి ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. అయితే దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.

వాళ్ల కుటుంబసభ్యులను ఆమె కలిసి ఓదార్చారు. ఆ చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతనాని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. మరోవైపు బాధిత కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వెచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు..

ఇంత పెద్ద ఘటన జరిగినా వాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఈ ప్రాంతమంతా దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ రాకపోవడం దురదృష్టకరం అని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేసీఆర్ నోరు విప్పి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.