ఆడపిల్ల బయటకు వెళ్లిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల్లో మాత్రం బయం లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా కనిపడితే చాలు.. మగవాళ్ల కళ్లు కామంతో మూసుకుని పోతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా నీచంగా వ్యవహరిస్తున్నారు..
దీంతో తన కోసమే వచ్చినట్టుగా మహిళలపై లైంగికదాడి చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి.. అయితే చివరికి అత్యాచార నిందితులకు చావే శరణ్యం అవుతున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక సీఐ తెలిపిన వివరాల ప్రకారం…
హన్మకొండ జిల్లా వడ్డేపల్లి పరిమళకాలనీకి చెందిన 69 ఏళ్ల భిక్షపతి విద్యా సంస్థలో సూపింటెండెంట్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. అతడి ఇంటి పక్కనే ఓ దివ్యంగుడు ఉంటున్నాడు. అతడికి ఓ కూతురు ఉంది. ఈ మధ్య ఆమె తల్లి పుట్టింటికి వెళ్లింది. వారిద్దరి మధ్య కలహాలు రావడంతో ఆమె తన తండ్రికి దూరంగా ఉంటుంది. దీంతో ఆ బాలికకు అన్నీ తానై చూసుకుంటున్నాడు.
దీనినే అదునుగా భావించిన ఆ వృద్ధుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆమెను ఆ దివ్యాంగులు ఏమైదంని అడగ్గా.. విషయం చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…