హైదరాబాద్ సిటీలో కొంతమంది ఆకతాయిలు సరదా కోసం సౌండ్ పొల్యూషన్ ను స్పష్టిస్తుంటారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన సైలెన్సర్ తీసేసి.. సౌండ్ ఎక్కువగా వచ్చే మరో సైలెన్సర్ ను అమర్చుతుంటారు. ఇలా వాళ్లు ఆ వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ తమ వైపే చూడాలనే ఆశ వాళ్లకు ఉంటుంది.
దీంతో ఆ సౌండ్ కారణంగా మహిళలు, చిన్న పిల్లలు. వృద్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్లు అయితే.. ఇంకా ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి భరతం పట్టేందుకు సిటీ పోలీసులు చాలా వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. అప్పుడు కొంతమంది దొరికారు.. కానీ ఇంకా అటువంటి చర్యలకు పాల్పడే వారు ఉన్నారు.
ఇటువంటి బండ్లు ఉంటే ఇక నుంచి వాటిని సీజ్ చేస్తామని.. కొన్ని బండ్లను సీజ్ చేసినట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. దీనిపై వాహనదారులకు కేబీఆర్ పార్క్ వద్ద అవగాహన కల్పించారు. హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో సైలెన్సర్లు మళ్లీ పనికి రాకుండా రోడ్ రోలర్ తో తొక్కించారు.
ఇలా పట్టుబడిన బండ్లు ఎక్కువగా బుల్లెట్ బండ్లు, స్పోర్ట్ బండ్లే ఉన్నాయన్నారు. ఇలా నగరవాసులకు, పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ సౌండ్ పొల్యుషన్ కు పాల్పడుతున్న వ్యక్తి మొదటి సారి పట్టుబడితే రూ.వెయ్యి పైన్, రెండో సారి అయితే రూ.2 వేలు, మూడో సారి అయితే వెహికిల్ సీజ్ చేస్తామన్నారు. మెకానిక్ లు ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదని కోరారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…