హైదరాబాద్ సిటీలో కొంతమంది ఆకతాయిలు సరదా కోసం సౌండ్ పొల్యూషన్ ను స్పష్టిస్తుంటారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన సైలెన్సర్ తీసేసి.. సౌండ్ ఎక్కువగా వచ్చే మరో సైలెన్సర్ ను అమర్చుతుంటారు. ఇలా వాళ్లు ఆ వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ తమ వైపే చూడాలనే ఆశ వాళ్లకు ఉంటుంది.
దీంతో ఆ సౌండ్ కారణంగా మహిళలు, చిన్న పిల్లలు. వృద్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్లు అయితే.. ఇంకా ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి భరతం పట్టేందుకు సిటీ పోలీసులు చాలా వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. అప్పుడు కొంతమంది దొరికారు.. కానీ ఇంకా అటువంటి చర్యలకు పాల్పడే వారు ఉన్నారు.
ఇటువంటి బండ్లు ఉంటే ఇక నుంచి వాటిని సీజ్ చేస్తామని.. కొన్ని బండ్లను సీజ్ చేసినట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. దీనిపై వాహనదారులకు కేబీఆర్ పార్క్ వద్ద అవగాహన కల్పించారు. హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో సైలెన్సర్లు మళ్లీ పనికి రాకుండా రోడ్ రోలర్ తో తొక్కించారు.
ఇలా పట్టుబడిన బండ్లు ఎక్కువగా బుల్లెట్ బండ్లు, స్పోర్ట్ బండ్లే ఉన్నాయన్నారు. ఇలా నగరవాసులకు, పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ సౌండ్ పొల్యుషన్ కు పాల్పడుతున్న వ్యక్తి మొదటి సారి పట్టుబడితే రూ.వెయ్యి పైన్, రెండో సారి అయితే రూ.2 వేలు, మూడో సారి అయితే వెహికిల్ సీజ్ చేస్తామన్నారు. మెకానిక్ లు ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదని కోరారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…