తెలంగాణ సర్కారు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలు మొత్తం మూసేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గడంతో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే ప్రభుత్వ హాస్టల్స్ కు విద్యార్థులు వస్తే.. గుంపులు గుంపులుగా ఉండటంతో మళ్లీ కరోనా సోకే అవకాశం ఉంటుందని.. గురుకులాల్లో ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత చాలా రోజుల తర్వాత ఇంటర్ పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలలను తెరవాలని.. దానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈ రోజు గురుకుల పాఠశాలలను తెరుచుకోవచ్చని హైకోర్టు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు అంటే.. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరుచుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది.
ఇదిలా ఉండగా గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ తరగతులకు బోధనా తరగతులను చేపట్టాలని కూడా స్ఫష్టం చేసింది. ఇక విద్యా సంస్థలో కరోనా వ్యాప్తి పెరకుండా ఉండటం కోసం తగిన జాగ్రత్తులు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…