Tag Archives: insurance policies

నగదు లావాదేవీలు ఎక్కువ చేస్తారా.. అయితే జాగ్రత్త.. వారు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు..?

చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడడంతో డిజిటల్ వైపు మళ్లారు. ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ వాలెట్ లే కనిపిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ఎంత నగదు లావాదేవీలు జరపొచ్చో తెలుసా.. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నగదు లావాదేవీలు నిర్వహించడంలో ఆదాయపు పన్ను శాఖ, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలను కఠినతరం చేశాయి. వారు చెప్పిన నిబంధనలు మాత్రం ఉల్లంఘిస్తే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవడం ఖాయం.

ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ ఐదు రకాల నగదు లావాదేవీలపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. అవేంటంటే.. సాధారణంగా ప్రతీ వ్యక్తికి నగదును దాచుకోవడానికి బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. దీనిలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేవి ఉంటాయి. అయితే సేవింగ్ అకౌంట్ కలిగిన వారు రూ.1 లక్ష కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే మాత్రం ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కరెంట్ ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ.50 లక్ష‌ల వరకు ఉంటుంది.

ఈ పరిమితి దాటితే నోటీసులు వస్తాయి. ఇక క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే.. క్రెడిట్ కార్డు చెల్లించేవారు రూ.లక్ష కంటే ఎక్కువ చెల్లిస్తే.. నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారి విషయంలో కూడా నగదు పరిమితులు విధించారు. అందులో కూడా రూ. 10 లక్షలకు మించి ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. లేదంటే ఆదాయ పన్ను శాఖ వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కూడా రూ.10 లక్షల కేటే ఎక్కువ పెట్టుబడులు మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

రియల్ ఎస్టేట్ విభాగంలో కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. అందులో ఒక ఆస్తిని విక్రయించినా.. కొనుగోలు చేసినా ఆ నగదు లావాదేవీలు అనేవి రూ.30 లక్షలకు మించి ఉండకూడదు. ఇటువంటి లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటీ శాఖ ప్రోత్సహించదు. మనం బ్యాంకులో చేసే ప్రతీ లావాదేవీల విషయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. పరిమితి మించితే మాత్రం ఐటీ అధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.

కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎల్టీసీ నగదు వోచర్లను ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు కొత్తగా తీసుకునే బీమా పాలసీలపై ఎల్టీసీ నగదు వోచర్ పథకం కీంద రీయింబర్స్ మెంట్ ను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది.

డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్ పిడెంచర్ నుంచి ఈ మేరకు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసిన వాటికి ఒరిజినల్ బిల్లులను కాకుండా జిరాక్స్ లను పెట్టి కూడా ప్రయోజనాలను పొందవచ్చు ఎల్టీసీ నగదు ఓచర్ పథకం గురించి కేంద్ర ప్రభుతం వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వర ఉద్యోగుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో లీవ్ ట్రావెల్ వోచర్ స్కీమ్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీన మోదీ సర్కార్ లీవ్ ట్రావెల్ వోచర్ స్కీమ్ ను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం వస్తువులను కొనుగోలు చేయవచ్చు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్లు బీమా పాలసీలకు కూడా వర్తిస్తాయని చెప్పిన కేంద్రం గతంలో తీసుకున్న పాలసీలకు మాత్రం ఈ వోచర్లను ఉపయోగించడం సాధ్యం కాదని తెలిపాయి.

అక్టోబ నెల 12 నుంచి వచ్చే ఏడాది లోపు ఎవరైనా కొత్తగా బీమా పాలసీలను తీసుకుంటే 2021 మార్చి 31 లోపు బిల్లులను సమర్పించి ప్రయోజనం పొందవచ్చు. అధికారులు అవసరమైతే జిరాక్స్ లతో పాటు ఒరిజినల్ బిల్లులను కూడా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.