కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎల్టీసీ నగదు వోచర్లను ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు కొత్తగా తీసుకునే బీమా పాలసీలపై ఎల్టీసీ నగదు వోచర్ పథకం కీంద రీయింబర్స్ మెంట్ ను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది.
డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్ పిడెంచర్ నుంచి ఈ మేరకు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసిన వాటికి ఒరిజినల్ బిల్లులను కాకుండా జిరాక్స్ లను పెట్టి కూడా ప్రయోజనాలను పొందవచ్చు ఎల్టీసీ నగదు ఓచర్ పథకం గురించి కేంద్ర ప్రభుతం వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వర ఉద్యోగుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో లీవ్ ట్రావెల్ వోచర్ స్కీమ్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీన మోదీ సర్కార్ లీవ్ ట్రావెల్ వోచర్ స్కీమ్ ను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం వస్తువులను కొనుగోలు చేయవచ్చు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్లు బీమా పాలసీలకు కూడా వర్తిస్తాయని చెప్పిన కేంద్రం గతంలో తీసుకున్న పాలసీలకు మాత్రం ఈ వోచర్లను ఉపయోగించడం సాధ్యం కాదని తెలిపాయి.
అక్టోబ నెల 12 నుంచి వచ్చే ఏడాది లోపు ఎవరైనా కొత్తగా బీమా పాలసీలను తీసుకుంటే 2021 మార్చి 31 లోపు బిల్లులను సమర్పించి ప్రయోజనం పొందవచ్చు. అధికారులు అవసరమైతే జిరాక్స్ లతో పాటు ఒరిజినల్ బిల్లులను కూడా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…