Featured

గూగుల్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలు లేవట..?

మన దేశంలో ఆరు కోట్లకు పైగా యూజర్లు డిజిటల్ లావాదేవీల కోసం గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారనే సంగతి విదితమే. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ గూగుల్ పే యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. దేశంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత నగదు రహిత లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రధానీ మోదీ నగదు రహిత లావాదేవీలకు పిలుపునివ్వడంతో ప్రజలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి వచ్చే ఏడాది నుండి గూగుల్ పే యాప్ ను వినియోగించే కస్టమర్లు డిజిటల్ లావాదేవీల కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. గూగుల్ పే ఛార్జీల గురించి అధికారికంగా ప్రకటన చేయకపోయినా అనధికారికంగా వైరల్ అయిన వార్తలు యూజర్లను తెగ టెన్షన్ పెట్టాయి. అయితే గూగుల్ పే కస్టమర్లు టెన్షన్ పడుతున్న నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించి స్పష్టతనిచ్చింది.

డిజిటల్ లావాదేవీలకు ఛార్జీలను అమలు చేస్తుండటం వాస్తవమేనని అయితే కేవలం అమెరికాలోని కస్టమర్లకు మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపింది. భారత్ లోని గూగుల్ పే కస్టమర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కంగారు పడవద్దని గూగుల్ పే సంస్థ వెల్లడించింది. గూగుల్ పే తాజా నిర్ణయం వల్ల భారత్ లోని వినియోగదారులకు టెన్షన్ తగ్గినట్టేనని చెప్పవచ్చు.

భారత్ లో గూగుల్ పే యాప్ కు 110 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. సంస్థ భారత్ లో 6.7 కోట్ల మంది గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారని, 30 లక్షల మంది వ్యాపారులు గూగుల్ పే బిజినెస్ యాప్ ను ఉపయోగిస్తున్నారని సంస్థ తెలిపింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

16 కోట్ల ఇంజెక్షన్‌తో పసిపాపకు కొత్త జీవితం..!

సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…

13 minutes ago

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

4 hours ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

4 hours ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

4 hours ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

4 hours ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

5 hours ago