మన దేశంలో ఆరు కోట్లకు పైగా యూజర్లు డిజిటల్ లావాదేవీల కోసం గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారనే సంగతి విదితమే. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ గూగుల్ పే యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. దేశంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత నగదు రహిత లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రధానీ మోదీ నగదు రహిత లావాదేవీలకు పిలుపునివ్వడంతో ప్రజలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి వచ్చే ఏడాది నుండి గూగుల్ పే యాప్ ను వినియోగించే కస్టమర్లు డిజిటల్ లావాదేవీల కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. గూగుల్ పే ఛార్జీల గురించి అధికారికంగా ప్రకటన చేయకపోయినా అనధికారికంగా వైరల్ అయిన వార్తలు యూజర్లను తెగ టెన్షన్ పెట్టాయి. అయితే గూగుల్ పే కస్టమర్లు టెన్షన్ పడుతున్న నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించి స్పష్టతనిచ్చింది.
డిజిటల్ లావాదేవీలకు ఛార్జీలను అమలు చేస్తుండటం వాస్తవమేనని అయితే కేవలం అమెరికాలోని కస్టమర్లకు మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపింది. భారత్ లోని గూగుల్ పే కస్టమర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కంగారు పడవద్దని గూగుల్ పే సంస్థ వెల్లడించింది. గూగుల్ పే తాజా నిర్ణయం వల్ల భారత్ లోని వినియోగదారులకు టెన్షన్ తగ్గినట్టేనని చెప్పవచ్చు.
భారత్ లో గూగుల్ పే యాప్ కు 110 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. సంస్థ భారత్ లో 6.7 కోట్ల మంది గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారని, 30 లక్షల మంది వ్యాపారులు గూగుల్ పే బిజినెస్ యాప్ ను ఉపయోగిస్తున్నారని సంస్థ తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…