Tag Archives: Jabardasth Anchors

Jabardasth Anchors: నువ్వా నేనా అంటూ పోటీపడిన జబర్దస్త్ యాంకర్స్… బయటపడిన విభేదాలు!

Jabardasth Anchors: జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి ఈ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా జబర్దస్త్ యాంకర్లుగా కొనసాగుతున్నటువంటి రష్మీ గౌతమ్ సౌమ్యరావు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తునట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందరి ముందు వేదికపై వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడ్డాయి.

ఇలా జబర్దస్త్ యాంకర్స్ మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే…ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మీ కొత్త యాంకర్ సౌమ్యరావు రావడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు సందడి చేశారు.నువ్వు రాగానే వెళ్ళిపోవడానికి నేనేమైనా పాత ముగ్గురు యాంకర్లు మాదిరి అనుకున్నావా అంటూ రష్మీ మాట్లాడింది. రష్మీ ఇలా మాట్లాడటంతో సౌమ్య రావు కూడా తనదైన శైలిలో పంచ్ వేసింది. పాత యాంకర్లు ముగ్గురు కాదు నలుగురు అంటూ సౌమ్య రావు రష్మికి కౌంటర్ ఇచ్చింది.

Jabardasth Anchors: నువ్వా నేనా అంటూ పోటీ పడిన యాంకర్స్…


ఇక వీరిద్దరు వేదికపైనే నువ్వు గొప్ప నేను గొప్ప అంటూ పోటీ పడుతూ గొడవకు దిగడంతో మధ్యలో ఇంద్రజ కల్పించుకొని మీ ఇద్దరు ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకుంటారు అని చెప్పడంతో వీరిద్దరూ ఇంద్రజను మెప్పించడం కోసం పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ అవుతుంది.