Tag Archives: karunanidhi

ఆ సినిమాతో కొన్ని కోట్లు నష్టపోయా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్..

మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడిగా.. జయభేరి గ్రూపు అధిపతిగా.. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుంచి గెలిచి ఎన్నో మైలురాళ్లు దాటాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ చానల్ ఇటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

అవేంటంటే.. మొదటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక బలంగా అతడతికి ఉండేదట. తన తండ్రి పాలిటిక్స్ లో ఉండటంతో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో వర్కింగ్ పార్టనర్ గా వర్క్ చేసేందుకు ఆఫర్ రాగా.. నెలకు రూ.100 జీతం.. లాభాల్లో వాటా కూడా ఇచ్చినట్లు చెప్పాడు. అదే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పాడు. అందులోనే 10 ఏళ్ల చేసినట్లు చెప్పాడు. అందులో దాదాపు 50 శాతం షేర్ కూడా తెచ్చుకున్నాడట. హీరోగా అతడికి ఆఫర్ రాగా.. వెళ్లినట్లు చెప్పాడు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసినట్లు చెప్పాడు.

తర్వాత రెండో సినిమాకు సంవత్సరం వెయిట్ చేశానని.. తర్వాత దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత దాసరి సినిమాల్లోనే ఎక్కువగా నటించినట్లు పేర్కొన్నాడు. ఈ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఒక సినిమా హిట్ అయితే అందరూ ఆనందాలను పంచుకుంటారు.. ఒక వేళ ఫెయిల్ అయితే మాత్రం నిర్మాతమీదనే ఎక్కువగా తోసేస్తున్నట్లు చెప్పాడు.

మణిరత్నం సినిమా అయిన ‘ఇద్దరు’ సినిమాలో కరుణానిధి,  ఎంజీఆర్ కు సంబంధించిన సినిమా అని.. అందులో కరుణానిధి క్యారెక్టర్ ను నెగెటివ్ గా.. ఎంజీఆర్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా తీశారు. అందులో తమిళనాడులో కరుణానిధి అధికారంలోకి రావడంతో.. ఆ సినిమాలో చాలాసీన్లు కట్ చేసినట్లు చెప్పాడు. దీంతో ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిందని.. అప్పటి వరకు సంపాదించిన సంపద అంతా పోయిందని చెప్పాడు మురళిమోహన్.

సినిమాలకు స్వస్తి చెప్పన్నున్న యంగ్ హీరో..?

కోలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉదయనిది స్టాలిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ హీరో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవడిగా, ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు గా అందరికీ పరిచయమే. ఈ క్రమంలోనే స్టాలిన్ కొడుకు గా ఇటు రాజకీయాలలోనూ, అటు సినిమాలలోనూ ఎంతో చురుకుగా ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఈ నటుడి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోలివుడ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇకపై సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో క్రైం థ్రిల్ల‌ర్ “క‌న్నేనంబ‌తే” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఉదయనిది ఆర్టిక‌ల్ 15 ను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత ఉదయనిది దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తన చివరి సినిమాను చేయనున్నారని కోలీవుడ్ సమాచారం.

సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమా పూర్తయిన తర్వాత ఉదయనిది ఇకపై సినిమాలకు స్వస్తి పలకనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఉదయనిధి తన దృష్టిని మొత్తం రాజకీయాల వైపు మళ్లీస్తున్నట్లు తెలుస్తోంది.

తండ్రి బాటలోనే వెళ్తూ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయా రంగంలోకి అడుగు పెట్టడం వల్లే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఉదయనిది స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నారనే విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే ఈ హీరో స్పందించే వరకు వేచి చూడాల్సిందే.