Tag Archives: krishna rice

రైతులకు లక్షాధికారులను చేస్తున్న బియ్యం ఇవే.. కిలో ఎంతంటే..?

సాధారణంగా కిలో బియ్యం ఎంత అనే ప్రశ్నకు ఎవరైన 30 రూపాయల నుంచి 50 రూపాయల ఖరీదు చేస్తుందని చెబుతారు. అయితే కృష్ణ బియ్యం మాత్రం ఏకంగా కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఈ బియ్యాన్ని పండించిన రైతులు కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కృష్ణ బియ్యం బలవర్ధక ఆహారంగా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బియ్యం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనేక రైతు కుటుంబాలు కృష్ణ బియ్యం పండించడం ద్వారా సంపన్న కుటుంబాలుగా మారాయని మోదీ అన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతుల వల్ల రైతులు కృష్ణబియ్యం పండించగలుగుతున్నారని మోదీ అన్నారు. చంద్రోలి రైతుల గురించి మాట్లాడుతూ కృష్ణబియ్యంలో ఒక రకాన్ని చంద్రోలి రైతులు పండించారని అన్నారు.

కృష్ణబియ్యం పండించిన రైతుల కొరకు ప్రత్యేక సమితిని ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కూడా సిద్ధం చేశామని అన్నారు. విదేశీ మార్కెట్ లో సైతం కృష్ణవ్రీహీ బియ్యంకు మంచి డిమాండ్ ఉంటుందని ఆస్ట్రేలియాకు కిలో 850 రూపాయల చొప్పున ఈ బియాన్ని ఎగుమతి చేస్తున్నామని మోదీ అన్నారు. ఈ బియ్యం ప్రాచీన వరి వంగడమని మోదీ అన్నారు. కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ సుశృత సంహితలో కృష్ణ వ్రీహీ బియ్యం గురించి ప్రస్తావించారని అన్నారు.

కృష్ణ బియ్యం అతి ప్రాచీన రకాల్లో ఒకటని ఈ బియ్యం పండించిన రైతులు చెబుతున్నారు. యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఈ బియ్యాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా వినియోగించేవారని రైతులు చెబుతున్నారు. కృష్ణ బియ్యం జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించటంలో సహాయపడతాయి.