సాధారణంగా కిలో బియ్యం ఎంత అనే ప్రశ్నకు ఎవరైన 30 రూపాయల నుంచి 50 రూపాయల ఖరీదు చేస్తుందని చెబుతారు. అయితే కృష్ణ బియ్యం మాత్రం ఏకంగా కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఈ బియ్యాన్ని పండించిన రైతులు కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కృష్ణ బియ్యం బలవర్ధక ఆహారంగా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బియ్యం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనేక రైతు కుటుంబాలు కృష్ణ బియ్యం పండించడం ద్వారా సంపన్న కుటుంబాలుగా మారాయని మోదీ అన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతుల వల్ల రైతులు కృష్ణబియ్యం పండించగలుగుతున్నారని మోదీ అన్నారు. చంద్రోలి రైతుల గురించి మాట్లాడుతూ కృష్ణబియ్యంలో ఒక రకాన్ని చంద్రోలి రైతులు పండించారని అన్నారు.
కృష్ణబియ్యం పండించిన రైతుల కొరకు ప్రత్యేక సమితిని ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కూడా సిద్ధం చేశామని అన్నారు. విదేశీ మార్కెట్ లో సైతం కృష్ణవ్రీహీ బియ్యంకు మంచి డిమాండ్ ఉంటుందని ఆస్ట్రేలియాకు కిలో 850 రూపాయల చొప్పున ఈ బియాన్ని ఎగుమతి చేస్తున్నామని మోదీ అన్నారు. ఈ బియ్యం ప్రాచీన వరి వంగడమని మోదీ అన్నారు. కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ సుశృత సంహితలో కృష్ణ వ్రీహీ బియ్యం గురించి ప్రస్తావించారని అన్నారు.
కృష్ణ బియ్యం అతి ప్రాచీన రకాల్లో ఒకటని ఈ బియ్యం పండించిన రైతులు చెబుతున్నారు. యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఈ బియ్యాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా వినియోగించేవారని రైతులు చెబుతున్నారు. కృష్ణ బియ్యం జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించటంలో సహాయపడతాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…