Tag Archives: manchu vishnu panel

“మా” ఎన్నికలలో ఓటుకు పది వేలు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్..!

అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి మంచు విష్ణు, ప్రకాష్ రాజు తీవ్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మంచు కుటుంబం బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవాలని కుట్రలు పడుతున్నట్టు ఆరోపించారు.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ పై కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటినుంచి మెగా బ్రదర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నాగబాబు మాట్లాడుతూ పదో తేదీ జరగబోయే మా ఎన్నికల గురించి ఒక విషయం విన్నానని, అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది అంటూ అసలు విషయం బయట పెట్టారు. ఆర్టిస్టులకు మొట్టమొదటిసారి మా డబ్బు ఆశ చూపి ఓట్లు కొనుక్కుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఒక ఓటుకు 10000 డబ్బును ఆశ చూపిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా నాగబాబు షాకింగ్ కామెంట్ చేశారు.

ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరోక్షంగా మంచు విష్ణు ఆర్టిస్టులను డబ్బుతో కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్నట్లు మెగాబ్రదర్ తెలియజేశారు అంటూ పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సి ఉందని నాగబాబు తెలిపారు. మరి నాగబాబు వ్యాఖ్యలపై మంచు విష్ణు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

‘మా’ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం.. మంచు విష్ణు ప్యానల్‌ ఇదే..!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ సారి హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించే సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సభ్యులు సోషల్ మీడియాలో.. మీడియా సమావేశాలలో బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు.

మా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంచు విష్ణు ప్రకటించిన మా బిల్డింగ్ తను కట్టిస్తానని చెప్పిన దగ్గన నుంచి దాని చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయి.ఇదే ప్రధాన అంశంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు కూడా తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించాడు. ఇందులో ఈసీ సభ్యులుగా 18 మందిని ప్రకటించాడు విష్ణు. మంచు విష్ణు ప్యానల్ లో.. అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఉపాధ్యక్షుడిగా మాదల రవి, పృథ్వీరాజ్ ఉన్నారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ట్రెజరర్ గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలు కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు లు ఉన్నట్లు ప్రకటించారు.

ఈసీ సభ్యుల్లో అర్చన, అశోక్‌కుమార్‌, గీతాసింగ్‌, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్‌ బాబు, శశాంక్‌, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల, రేఖ ఉన్నారు. అయితే అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‏లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.