Tag Archives: mega hero

Mega Hero: వరుణ్ లావణ్య పెళ్లి చేసుకోవడం ఆ మెగా హీరోకి ఇష్టం లేదా.. అందుకే దూరంగా ఉన్నారా?

Mega Hero: మెగా వారసుడు వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాటితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇటీవల ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 9వ తేదీ వీరి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వీరి వరుణ్ తేజ్ – లావణ్య నిశ్చితార్థ వేడుకకు అల్లు వారి కుటుంబం కూడా హాజరయ్యింది. అయితే అల్లు శిరీష్ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు.

అల్లు శిరీష్ హాజరు కాకపోవడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థానికి అల్లు శిరీష్ హాజరు కాకపోవటానికి కారణాలేమిటనీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..ఈ క్రమంలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ లావణ్య నిశ్చితార్థానికి అల్లు శిరీష్ హాజరు కాకపోవడానికి పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠి కలిసి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో నటించారు.

un

Mega Hero: లావణ్య పై ఇష్టం పెంచుకున్నారా…


ఆ సినిమా షూటింగ్ సమయంలో అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠిని ఇష్టపడ్డాడని ఆ విషయం ఆమెకు చెప్పగా లావణ్య త్రిపాఠి శిరీష్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే లావణ్య అప్పటికే వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉండటంవల్ల అల్లు శిరీష్ ప్రేమను తిరస్కరించినట్లు సమాచారం. అయితే అల్లు శిరీష్ మాత్రం ఆమె మీద ఇష్టాన్ని పెంచుకున్నాడని, అందువల్ల ఇప్పుడు లావణ్యకి వరుణ్తో నిశ్చితార్థం జరగటం వల్ల ఆ బాధతో ఈ నిశ్చితార్థానికి హాజరు కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అల్లు శిరీష్ స్పందించాల్సి ఉంటుంది.

Mega Hero: మెగా హీరోతో ప్రేమలో పడిన హీరోయిన్..? సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిందిగా?

Mega Hero: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి వారసులిగా ఆయన తమ్ముళ్లతో పాటు అల్లుళ్ళు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇలా మెగా అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, సోలో బతుకే సో బెటర్ వంటి సినిమాలలో నటించి మంచి హిట్ అందుకున్నాడు.

 

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల ప్రమాదానికి గురవటంతో చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సాయి ధరమ్ తేజ్ వివాహం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. తాజాగా మరొక్కసారి సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్త వైరల్ కావటానికి కారణం హీరోయిన్ లారిస్సా బోనేసి పెట్టిన ట్వీట్ . బ్రెజిల్ కి చెందిన లారీస్సా బోనేసి మోడల్ గా కెరియర్ ప్రారంభించి “తిక్క” సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించకుంది. అయితే ఈ సినిమా క్లాస్ అవ్వటంతో ఈమె సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. తాజాగా సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సాయిధరమ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Mega Hero: ఐయామ్ ఇన్ లవ్..

ఈ మేరకు హీరోయిన్ లారిస్సా బోనేసి “హ్యాపి బర్త డే మై తేజు” అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత “ఐ యామ్ ఇన్ లవ్ ” అంటూ మరొక ట్వీట్ పెట్టింది . ఇలా ట్వీట్ చేయటంతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సాయిధరమ్ తేజ్ స్పందించాల్సి ఉంటుంది.

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. పోస్ట్ వైరల్!

Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అందుకు గల కారణం వరుణ్ తేజ్ జనవరి 19వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవడంతో ఆయన 25 లక్షల విలువచేసే డైమండ్ రింగ్ తో బెంగుళూరుకి వెళ్లారని, డైమండ్ రింగ్ తో లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Lavanya Tripathi: మెగా హీరో ప్రపోజల్ గురించి క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. పోస్ట్ వైరల్!

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలకు లావణ్యత్రిపాఠి కేవలం ఒకే ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా లావణ్య త్రిపాఠి తన కుటుంబంతో కలిసి డెహ్రడూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వారి ఊరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Lavanya Tripathi: మెగా హీరో ప్రపోజల్ గురించి క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. పోస్ట్ వైరల్!

ఈ సందర్భంగా లావణ్య త్రిపాటి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ ప్రస్తుతం డెహ్రడూన్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా… మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్న అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ఈ విధంగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన గురించి వస్తున్న గాసిప్ లకు క్లారిటీ ఇచ్చారు.అయితే వీరి గురించి ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలో నటించారు.ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. అదేవిధంగా వరుణ్ తేజ్ సోదరి నిహారిక వివాహంలో హీరోయిన్ ఎవరు లేకపోయినా లావణ్యత్రిపాఠి మాత్రమే కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇలా వీరి గురించి వస్తున్న ఈ వార్తలకు లావణ్యత్రిపాఠి క్లారిటీ ఇచ్చారు.

పిల్లల విషయంలో మెగా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఉపాసన.. అసలేం జరగదంటే?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈమె మెగా ఇంటి కోడలిగా కంటే తన సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ప్రజలకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.

ఇక రామ్ చరణ్, ఉపాసన ఓ మీటింగ్ లో తొలిసారిగా పరిచయం పెంచుకోగా.. అలా వారి మధ్య ప్రేమ మొదలయిందని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారని గతంలో తెలిపారు. ఇక ఈ ఏడాదికి తమ పెళ్ళి జరిగి 9 ఏళ్లు అవగా ఇప్పటికీ తమకు పిల్లలు పుట్టే లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా తమకు పిల్లల గురించి అభిమానుల నుండి మీడియా నుండి కూడా తెగ ప్రశ్నలు ఎదురవగా వాటి గురించి ఎన్నోసార్లు స్పందించారు. అయినా కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో ఉపాసన సోషల్ మీడియాలో కామెంట్ బాక్స్ ని కూడా బ్లాక్ చేసింది.

ఇక గతంలో తమ పిల్లల గురించి ఉపాసన స్పందించిన విషయం ప్రస్తుతం మళ్లీ నెట్టింట్లో వైరల్ గా మారింది. పిల్లల విషయంలో పూర్తిగా మా వ్యక్తిగత విషయం ఉంటుందని, మాకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాకు పిల్లలు కలుగుతారని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా మాకేమైనా వయసు అయిపోయిందా అంటూ మండిపడింది. అయినా మా వ్యక్తిగత విషయాల గురించి మీరు మధ్యలోకి రావద్దని.. మా కెరీర్ లో మాకు కొన్ని గోల్స్ ఉన్నాయని.. అవన్నీ తీరిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తామని తెలిపింది.

అంతేకాకుండా తమ ఇంట్లో కూడా తమ కుటుంబ సభ్యులు తమ నిర్ణయం మీదనే ఉన్నారని.. దయచేసి మా వ్యక్తిగత జీవితంలోకి రాకుండా ఉండటం మంచిదని స్పందించింది ఉపాసన. ఇక మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ వారసుడిని చూడాలని ఎంతో తాపత్రయ పడుతున్నారు. కానీ ఇప్పటంతలా అభిమానుల కోరిక తీరేలా లేదని తెలుస్తుంది.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకిందా..?

ఈ మధ్య కాలంలో వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో కరోనా వార్తలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి తేజ్ పై ఇలాంటి వార్తలు రావడానికి ఒక ముఖ్యమైన కారణమే ఉంది. సాయి తేజ్ ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాను ఓటీటీ జీ 5కు విక్రయించారు. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీలో సోలే బతుకే సో బెటర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా సాయి తేజ్ కు కరోనా సోకడంతో డబ్బింగ్ పనులు ఆగిపోయాయని.. ఈ మేరకు సినిమా నిర్వాహకులు జీ ఛానల్ వాళ్లకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అయితే సాయి తేజ్ కు కరోనా సోకిందో లేదో అధికారికంగా తెలియాల్సి ఉంది.

సాయి తేజ్ కు కరోనా నిర్ధారణ అయితే మాత్రం సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ మొత్తం చెల్లించి జీ నిర్వాహకులు ఈ సినిమాను కొనుగోలు చేసిన నేపథ్యంలో జీ తెలుగు సినిమా రిలీజ్ ఆలస్యమైతే ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా నిర్ధారణ కాగా ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. రెండు రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా సైతం కరోనా బారిన పడి వేగంగా కోలుకున్న విషయం విదితమే. అయితే సినీ ప్రముఖులకు కరోనా నిర్ధారణ అవుతూ ఉండటంతో ఆయా సెలబ్రిటీల ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.