ప్రస్తుతం డబ్బులు తీసుకోవాలన్నా.. డబ్బు డిపాజిట్ చేయాలన్నా.. బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా అయింది. ఎందుకంటే.. అంతా డిజిటల్ మయం కాబట్టి. ఆన్ లైన్ లోనే అన్ని జరిగిపోతున్నాయి. అయితే ఆన్లైన్ లో అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు భారీ నష్టాన్ని తీసుకురావచ్చు. అందులో ముఖ్యమైనది అమౌంట్ ట్రాన్సఫర్.
ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటికి రెండు సార్లు… అకౌంట్ నంబర్ లేదా.. ఫోన్ నంబర్ ను సరిచూసుకోవాలి. లేదంటే, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి బ్యాంక్ ను సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
మొదట నేరుగా మీ బ్యాంక్ కు వెళ్లి.. మీ వివరాలను బ్రాంచ్ మేనేజర్ కు అందించాలి. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మీకు జరిగిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకుంటారు. ఏం జరిగిందో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అతడు దానిని ఎలా రికవరీ చేయాలనే వివరాలను వివరంగా చెబుతారు. తర్వాత ప్రతీ దినం కస్టమర్ కేర్ సెంటర్ కి కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది.
ఇలా రెండు మూడు రోజుల సమయం తర్వాత మనం తప్పుగా ఎంటర్ చేసిన అకౌంట్ నుంచి డబ్బులను మన అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు. పొరపాటున వేరే అకౌంట్కు పంపిన మీ డబ్బును తిరిగి పొందేందుకు పై మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ రాకుండా ఉండాలంటే.. ఐఎఫ్ఎస్సీ కోడ్ ను కూడా జాగ్రత్తగా సరి చూసుకోవాలి.
దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. భారత్ లో కోట్ల సంఖ్యలో ప్రజలు ఇతరులకు నగదు పంపడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర అవసరాల కోసం గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. గూగుల్ కంపెనీ తాజాగా కస్టమర్లకు వరుస శుభవార్తలు చెప్పింది. వినియోగదారులకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. యాప్ ను రీబ్రాండ్ చేయడంతో పాటు కొత్త లోగోను తీసుకొచ్చింది.
అయితే గూగుల్ పే అందుబాటులోకి తెచ్చిన కొత్త సర్వీసులు ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ పే కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో కొత్త సర్వీసులను ఇతర దేశాల్లో సైతం అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ సంస్థ ప్రయత్నిస్తోంది. భారతదేశంలో సైతం త్వరలో గూగుల్ సంస్థ గూగుల్ పే కొత్త సర్వీసులను లాంఛ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గూగుల్ పే కస్టమర్లకు కొత్త సర్వీసుల్లో భాగాల్లో కస్టమర్లు బ్యాంక్ అకౌంట్ తెరిచే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ బ్యాంక్ సర్వీసుల ద్వారా కస్టమర్లు మనీ ట్రాన్స్ఫర్, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. లావాదేవీల వివరాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల వివరాలు, అనాలిటిక్స్ వివరాలను సైతం పొందే అవకాశం ఉంటుంది. గూగుల్ పేమెంట్స్కు చెందిన సీజర్ సేన్గుప్తా అన్ని ఆర్థిక వ్యవహారాలకు ఒకే యాప్ అనే విధంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.
మన దేశంలో గూగుల్ పే యాప్ 11 బ్యాంకులతో జత కట్టింది. గూగుల్ పే యూజర్లకు కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే తమకు నచ్చిన బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తెరిచిన కస్టమర్లు ఉచితంగా ఏటీఎం సర్వీసులను పొందవచ్చు. కొత్తగా అందుబాటులో తెచ్చిన సర్వీసులను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net