Tag Archives: mother died

Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?

Director Parasuram: మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ పరుశురాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిఖిల్ హీరోగా యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ విధంగా పరశురామ్ దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?

ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరుశురాం వ్యక్తిగత విషయంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ సొంత బాబాయి కుమారుడే పరశురామ్.

Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?

పరశురామ్ పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊళ్లో అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. తన నాన్న కో ఆపరేటివ్ బ్యాంకులో చిన్న ఉద్యోగిగా పని చేసేవారు తన తల్లి పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను చేసుకునేవారు.ఇలా ఒక రోజు కోళ్లకు వైరస్ సోకి పెద్దమొత్తంలో నష్టాలు వచ్చాయి.

ఆ డబ్బులతో పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలని ఆశపడిన తన తల్లి కోరిక నెరవేరలేదు ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లల చదువులు కొనసాగాయి. అలా పరశురాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశారు. ఇలా ఎంబీఏ చదువుతూనే ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ పని చేసేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్‌ రావడంతో ఇంటికెళ్లి తన తల్లికి వైద్య పరీక్షలు చేయించారు. దీంతో తనకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పడంతో తన స్నేహితులతో కలిసి రక్తం కూడా ఇచ్చారు.

ఈ విధంగా తన తల్లికి చికిత్స చేయించిన అనంతరం తిరిగి వచ్చిన పరశురామ్ కు మరో పది రోజుల వ్యవధిలోనే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని కబురు రావడంతో పూర్తి స్థాయి పరీక్షలు చేయించిన పరుశురామ్ ఒక చేదు వార్త తెలిసింది.తన తల్లి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని మూడు నెలలకు మించి బతకరని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది.

పూరి జగన్నాథ్ సహాయంతో…

ఈ విధంగా డాక్టర్లు చెప్పడంతో తన తల్లిని హైదరాబాద్ తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించిన చికిత్స స్పందించారు.అయితే ఈ విషయం తెలిసిన ఆమె ఆరు నెలలకు మృతి చెందారు. ఈ విధంగా బ్లడ్ క్యాన్సర్ తో తన తల్లి మృతి చెందడంతో ఉన్న ఆస్తులను అమ్మి తన అక్కకు పెళ్లి చేశారు.ఇక ఈయన కూడా హైదరాబాద్ వచ్చి పూరి జగన్నాథ్ సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.