Tag Archives: nalgonda district

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. మహంకాళి అమ్మవారి పాదల వద్ద మొండెం లేని తల ప్రత్యక్షం..!

Crime News నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి విగ్రహం పాదాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మొండెం లోని తలను స్థానికులు గుర్తించారు.

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. మహంకాళి అమ్మవారి పాదల వద్ద మొండెం లేని తల ప్రత్యక్షం..!

ఈ ఇన్సిడెంట్ కాలనీలో భయాందోళనలు రేపింది. మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరుచేసిన తలను వదిలి వెళ్లారు దుండగులు. దీంతో ఆ ప్రాంతమంతా ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. మహంకాళి అమ్మవారి పాదల వద్ద మొండెం లేని తల ప్రత్యక్షం..!

బాధితులు ఎవరో ఇంకా గుర్తు పట్టలేదు. కానీ అతని వయస్సు దాదాపు 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. ఇది నరబలి కేసు అయి ఉండొచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వ్యక్తిని హత్య చేసి తలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..


హత్యా చేశారా.. ఆత్మహత్య చేసుకున్నారా ..?

వివాహేతర సంబంధంపై కొద్ది రోజుల క్రితం సంఘటనా స్థలానికి సమీపంలోని కుర్మేడు వద్ద పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీల మధ్య ఘర్షణ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక దీనిపై స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతర శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. అసలు ఇది ఎలా జరిగింది.. హత్యా చేశారా.. ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

చెట్టుపైనే అన్నీ… భోజనం, నిద్ర అన్ని అక్కడే.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొల్పింది.కొందరు కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మరికొందరు కరోనా బారిన పడి తమ కుటుంబానికి సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన ఓ వ్యక్తి తమ కుటుంబానికి కరోనా రాకూడదనే ఉద్దేశంతో ఏకంగా చెట్టుపైనే హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోని గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా బారిన పడ్డాడు.ఈ క్రమంలోనే శివ తన ద్వారా తన ఇంట్లో వారికి కరోనా సోకు కూడదని భావించడంతో హోమ్ ఐసోలేషన్ అయ్యాడు. అయితే వారి ఇల్లు చిన్నదిగా ఉండటంతో ప్రత్యేక గది లేకపోవటం వల్ల శివ తన ఇంటి ముందు ఉన్న ఒక చెట్టు పై తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

చెట్టుపై కొమ్మకు మంచం కట్టి అక్కడే ఐసోలేషన్ అయ్యాడు. తమ కుటుంబం అతనికి కింది నుంచి నీటిని ఆహారాన్ని పంపిస్తుంది.శివ కుటుంబంలో మిగిలిన నలుగురు కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా తన మాత్రం చెట్టుపై ఐసోలేషన్ అయ్యాడు. గత తొమ్మిది రోజుల నుంచి అతనికి నిద్ర, ఆహారం, అన్ని ఈ చెట్టు పైనే. ఇంట్లో ప్రత్యేకంగా ఉండటానికి గది లేక పోవటం వల్లనే ఈ విధంగా చెట్టుపై ఉంటూ ఈ వ్యాధి మరొకరికి సోకకుండా జాగ్రత్త పడుతున్నట్లు శివ తెలిపారు.