Tag Archives: nandamuri taraka ramarao

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

నందమూరి తారక రామారావు తెలుగు భాషా కీర్తి బావుటాను దశదిశలా ఎగురవేసిన గొప్పనటుడు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను తనదైన శైలిలో నటిస్తూ కఠిన సంభాషణలను సైతం అవలీలగా పలుకుతూ.. త్రేతా ద్వాపర యుగం నాటి పాత్రలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు.. కర్ణుడు, అర్జునుడు, భీముడు లాంటి పాత్రలను ధరించి.. ఆ దేవుళ్ళు సైతం కళ్లముందు సాక్షాత్కరించేల ప్రేక్షకులను ఆనందింపజేసారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

మన దేశం, పల్లెటూరిపిల్ల, షావుకారు చిత్రాల తర్వాత ఎన్టీరామారావు తనను తాను నిరూపించుకోవడానికి “పాతాళభైరవి’ చిత్రం ఆయన సినిమా కెరీర్ కు ఎంతగానో దోహదపడింది. విజయ సంస్థతో తీసిన చిత్రాలు ఆయనకు ఎంతగానో పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత వారు నిర్మించిన ‘మాయాబజార్’ చిత్రంలో ఆయన శ్రీకృష్ణుని పాత్రలో కనిపించారు. ఆ సినిమా విజయవంతమవడంతో పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుని పాత్రలకు ఎన్టీరామారావుని దర్శకులు తీసుకునేవారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

ఆ తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి.. అనేక చిత్రాలు రూపొందిస్తూ ఆ చిత్రాల్లో ఆయనే కథానాయకుడిగా నటించారు. 1970 దశకం వచ్చేసరికి సాంఘిక చిత్రాల హవా కొనసాగింది.. ఆ సమయంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అడవిరాముడు’ చిత్రం ఆయన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అదే సంవత్సరంలో ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని నిర్మిస్తూ.. స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత వేటగాడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, బెబ్బులిపులి లాంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలలో నటించారు.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1980 దశకం ప్రారంభంలో సినిమాలకు స్వస్తి చెప్పి 1982లో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు. ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన ఏడాదిలోపే ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందింది. ఈ రాజకీయ విరామంలో అన్నగారు కొన్ని చిత్రాల్లో నటించారు.

ఎన్టిఆర్ అధికారం కోల్పాయక తీసిన సినిమాలు ఇవే..!

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1991 ఎన్టీఆర్ పిక్చర్స్, హరికృష్ణ నిర్మాణం, ఎన్టీరామారావు దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు, మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రలో కనిపించారు. పురాణాల్లో విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని నేటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయలపై విమర్శనాస్త్రంగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ రూపొందించారు. అన్నగారు అధికారం కోల్పోయాక వచ్చిన ఈ మొదటి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1992 రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్, ఎన్టీఆర్ నిర్మాణ, దర్శకత్వంలో ‘సామ్రాట్ అశోక’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, వాణి విశ్వనాథ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చారిత్రక చిత్రంలో అశోకుడు, చాణక్యుడిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1993 రామకృష్ణ హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్, బాపు దర్శకత్వంలో ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, జయసుధ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీనాథుని జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఇతిహాస, పురాణ, చారిత్రక పురుషుల పాత్రలను ఎన్టీఆర్ తన సినీ ప్రయాణంలో పోషించి.. ఆ పాత్రలకే వన్నెతెచ్చినప్పటికీ ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందింది.

NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!

1993,లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి తిరిగి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు.