ఏపీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 31 ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదలైన నోటిఫికేషన్ లో డీఈఓ, హౌజ్కీపర్, లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నెల్లూరులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 2020 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హతలో మార్పులు ఉన్నాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ, పీజీడీసీఏ వరకు ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో అర్హత ఉంది. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం బట్టి వేతనం లభిస్తుంది. ఈ నెల 5వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.