Tag Archives: potassium

జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారా.. సోంపుతో ఇలా చెయ్యండి..?

సోంపు అంటే మన భాషలో చాలామంది ఒక్కపొడి అని కూడా అంటారు. ఇవి చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాలలోనే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా ముఖ్యంగా బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి.

బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. తిన్న ఆహారం వెంటనే జీర్ణం కావడానికి మరియు నోటిలో ఏమైనా వాసన లాంటివి వస్తే వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ సోంపు గింజలను ఉపయోగిస్తారు. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, పైల్స్, ఆమ్లత్వం, వాయువు వంటి సమస్యలను అధిగమిస్తారు. నిద్రసరిగ్గా పట్టని వాళ్లు ఈ సోంపు తినడం ద్వారా వెంటనే నిద్ర పడుతుంది.

నిద్రకు ఎక్కువగా ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్. దీనిని తినడం ద్వారా మెలటోనిన్ స్రవించడానికి పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. దగ్గు, ఆయాసం మరియు జలుబు తగ్గడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. 10 గ్రాముల సోంపు గింజలను 250 మిల్లి లీటర్ల నీటిలో కలిసి గోరువెచ్చగా వేడి చేయాలి. తర్వాత వడబోసి 100 మి. లీటర్లు కాచిన పాలు ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ పటికబెల్లం పొడి కలిపి రాత్రి పడుకునే సమయంలో సేవించాలి.

ఇలా చేయటం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం అనేవి మాయం అయిపోతాయి. అలా కాకుంటే.. సోంపు గింజల పొడి 25 గ్రాములు, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటికబెల్లం పొడి 75 గ్రాములు కలిపి ఉంచి రోజుకి రెండుపూటల పూటకు అర టీ స్పూను పొడిని 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, ఆయాసం మన దరి చేరవు.

రేగు పండ్లు తినేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సింది..!

రేగుపండ్లు శీతాకాలంలో విరివిగా లభించే పండ్లలో ఒకటని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పండ్లను భోగి రోజు చిన్న పిల్లలపై వేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి పిల్లల్ని కాపాడుతుందని భావిస్తారు. అందుకే భోగి రోజు భోగి పళ్ళగా వీటిని పిల్లలపై పోయడం అనాదిగా వస్తున్న ఆచారంగా భావిస్తారు. రుచికి తీపి,పులుపు కలిపినట్టు ఉన్న ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ రేగు పళ్ళు చెట్టు నుంచి మొదలుకుని ప్రతి ఒక్కటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే రేగి పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ రేగు పండ్లలో ఎక్కువగా విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా లభిస్తాయి. విటమిన్ సి మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ ఏ వల్ల ఎటువంటి కంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది. ఇవే కాకుండా రేగుపళ్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ రేగు పండ్లను తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.అదేవిధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రేగు పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

డయేరియా, నీళ్ల విరోచనాలు వంటి సమస్యతో బాధపడేవారు రేగు పండ్ల చెట్టు బెరడును తీసి కషాయం తయారుచేసి తాగించడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. అదేవిధంగా చర్మ అలర్జీలు ఉన్నవారు రేగుపళ్ళు ఆకును మెత్తగా రుబ్బి అంటించుకోవడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రేగు పండు విత్తనాలను బాగా ఎండబెట్టి పొడిచేసి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. కానీ ఎర్రగా పండిన రేగుపండ్లను తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.పచ్చి రేగు పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండు తినాల్సిందే..!

మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో దొరికే పండ్లలో అరటి పండు ఒకటి అని చెప్పవచ్చు. ఈ అరటి పండును ఎంతోమంది ఇష్టంగా తింటారు. ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో లభించే మినరల్స్, విటమిన్స్, ఫైబర్,పొటాషియం అధిక శాతంలో ఉండటం వల్ల రోజంతా మనకు ఎంతో శక్తిని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

 

అరటి పండులో ఎక్కువ భాగం పోషకాలు లభించడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అరటి పండ్లలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల ఆహారం జీర్ణం అవ్వడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్దక సమస్యను నివారించడంలో అరటిపండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకోసమే భోజనం చేసిన తర్వాత ప్రతి రోజు ఒక అరటి పండును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్దక సమస్యను తొలగిస్తుంది.

అరటి పండులో ఉండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రక్తపోటును నివారించడంమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుంది. మన కడుపులో మంట, అజీర్తి ఏర్పడినప్పుడు అరటిపండు తినడం వల్ల అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అరటి పండులో ఉన్న విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అరటి పండును ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.