Tag Archives: power bill

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. ఇకపై కరెంట్ బిల్లు ముందే కట్టాలంట..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవాసులకు ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మొబైల్ రీఛార్జ్ చేసుకుని టెలీకాం సేవలను ప్రస్తుతం ఏ విధంగా పొందుతున్నామో ఇకపై నగరవాసులు అదే విధంగా ప్రీ పెయిడ్ మీటర్లను రీచార్జ్ చేసుకుంటే మాత్రమే విద్యుత్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రోజురోజుకు నగరంలో బిల్లులు వేలల్లో పేరుకుపోతూ ఉండటంతో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డిస్కం ఉన్నతాధికారులు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చగా ఆ సంఖ్యను మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులో ఉండగా త్వరలో ప్రైవేట్ కార్యాలయాల్లో సైతం ప్రీ పెయిడ్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. డిస్కం అధికారులు తక్కువ విద్యుత్ కనెక్షన్లు ఉన్న డివిజన్లను ఎంపిక చేసుకుని ఆ డివిజన్లలో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని భావిస్తున్నారు.

వినియోగదారులు ముందుగానే రీచార్జ్ చేసుకుని రీచార్జ్ చేసుకున్న డబ్బులు అయిపోయేంత వరకు విద్యుత్ ను వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది. విద్యుత్‌ రంగ నిపుణులు భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ మీటర్లు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఫలితంగా మొండి బకాయిలకు సులభంగా చెక్ పెట్టవచ్చన్ చెబుతున్నారు. ప్రజలకు సైతం ప్రీపెయిడ్ మీటర్ల వల్ల ఒకింత ప్రయోజనం చేకూరనుంది.

చాలామంది కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల జరిమానాలను చెల్లిస్తున్నారు. అయితే ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే మాత్రం జరిమానాల సమస్య కూడా ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు సత్ఫలితాలు ఇచ్చాయని స్వయంగా అధికారులు చెబుతూ ఉండటం గమనార్హం.

కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ తో పని చేసే ఉత్పత్తుల వాడకం పెరగడం విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమవుతోంది. చాలామంది తాము తక్కువగానే విద్యుత్ ను వినియోగిస్తున్నా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తోందని చెబుతూ ఉంటారు. అయితే తెలిసీ తెలియక చేసే చిన్నచిన్న పొరపాట్లే ఎక్కువ మొత్తంలో బిల్లు రావడానికి కారణమవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మన నిర్లక్ష్యం వల్లే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది.

అవసరం లేకపోయినా ఫ్యాన్లు వేయడం, తరచూ ఫ్రిజ్ తలుపులు తెరుస్తూ మూస్తూ ఉండటం, టీవీ స్విచ్ నిరంతరం ఆన్ లో ఉండి టీవీ ఆఫ్ లో ఉండటం, అవసరం లేని సమయంలో బల్బులు వెలుగుతూ ఉండటం, ఎక్కువ లైటింగ్ అవసరం లేకపోయిన చోట్ల కూడా ఎక్కువ వెలుగును ఇచ్చే లైట్లను వినియోగించడం, ఇతర కారణాల వల్ల కొన్నిసార్లు తక్కువ విద్యుత్ ను వినియోగించినా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

మనం ఇంట్లో ఉపయోగించే తక్కువ ధర ఉన్న ఐసీఎల్ బల్బు విద్యుత్ వినియోగం సంవత్సరానికి 72 యూనిట్లు ఉంటుంది. ఒక బల్బుకు సంవత్సరానికి 264 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సీ.ఎఫ్.ఎల్ బల్బుకు సంవత్సరానికి 18 యూనిట్ల విద్యుత్ అవసరం కాగా 66 రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్.ఈ.డీ బల్బులు మాత్రం సంవత్సరానికి కేవలం 11 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది.

ఎల్.ఈ.డీ బల్బులకు విద్యుత్ ఛార్జీలు ఏడాదికి 40 రూపాయలుగా ఉంటాయి. ఎక్కువగా ఎల్.ఈ.డీ బల్బులను వినియోగిస్తే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఏసీలను 26 డిగ్రీల దగ్గర వినియోగించడం వల్ల కూడా కరెంట్ బిల్లులను ఆదా చేయవచ్చు. ఫ్రిజ్ లకు ఉన్న స్టార్ రేటింగ్ ను బట్టి విద్యుత్ వినియోగం అంతకంతకూ తగ్గుతుంది.