దేశంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ తో పని చేసే ఉత్పత్తుల వాడకం పెరగడం విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమవుతోంది. చాలామంది తాము తక్కువగానే విద్యుత్ ను వినియోగిస్తున్నా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తోందని చెబుతూ ఉంటారు. అయితే తెలిసీ తెలియక చేసే చిన్నచిన్న పొరపాట్లే ఎక్కువ మొత్తంలో బిల్లు రావడానికి కారణమవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మన నిర్లక్ష్యం వల్లే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది.
అవసరం లేకపోయినా ఫ్యాన్లు వేయడం, తరచూ ఫ్రిజ్ తలుపులు తెరుస్తూ మూస్తూ ఉండటం, టీవీ స్విచ్ నిరంతరం ఆన్ లో ఉండి టీవీ ఆఫ్ లో ఉండటం, అవసరం లేని సమయంలో బల్బులు వెలుగుతూ ఉండటం, ఎక్కువ లైటింగ్ అవసరం లేకపోయిన చోట్ల కూడా ఎక్కువ వెలుగును ఇచ్చే లైట్లను వినియోగించడం, ఇతర కారణాల వల్ల కొన్నిసార్లు తక్కువ విద్యుత్ ను వినియోగించినా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మనం ఇంట్లో ఉపయోగించే తక్కువ ధర ఉన్న ఐసీఎల్ బల్బు విద్యుత్ వినియోగం సంవత్సరానికి 72 యూనిట్లు ఉంటుంది. ఒక బల్బుకు సంవత్సరానికి 264 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సీ.ఎఫ్.ఎల్ బల్బుకు సంవత్సరానికి 18 యూనిట్ల విద్యుత్ అవసరం కాగా 66 రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్.ఈ.డీ బల్బులు మాత్రం సంవత్సరానికి కేవలం 11 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
ఎల్.ఈ.డీ బల్బులకు విద్యుత్ ఛార్జీలు ఏడాదికి 40 రూపాయలుగా ఉంటాయి. ఎక్కువగా ఎల్.ఈ.డీ బల్బులను వినియోగిస్తే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఏసీలను 26 డిగ్రీల దగ్గర వినియోగించడం వల్ల కూడా కరెంట్ బిల్లులను ఆదా చేయవచ్చు. ఫ్రిజ్ లకు ఉన్న స్టార్ రేటింగ్ ను బట్టి విద్యుత్ వినియోగం అంతకంతకూ తగ్గుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…