దేశంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ తో పని చేసే ఉత్పత్తుల వాడకం పెరగడం విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమవుతోంది. చాలామంది తాము తక్కువగానే విద్యుత్ ను వినియోగిస్తున్నా ఎక్కువ మొత్తంలో బిల్లు వస్తోందని చెబుతూ ఉంటారు. అయితే తెలిసీ తెలియక చేసే చిన్నచిన్న పొరపాట్లే ఎక్కువ మొత్తంలో బిల్లు రావడానికి కారణమవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మన నిర్లక్ష్యం వల్లే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది.
అవసరం లేకపోయినా ఫ్యాన్లు వేయడం, తరచూ ఫ్రిజ్ తలుపులు తెరుస్తూ మూస్తూ ఉండటం, టీవీ స్విచ్ నిరంతరం ఆన్ లో ఉండి టీవీ ఆఫ్ లో ఉండటం, అవసరం లేని సమయంలో బల్బులు వెలుగుతూ ఉండటం, ఎక్కువ లైటింగ్ అవసరం లేకపోయిన చోట్ల కూడా ఎక్కువ వెలుగును ఇచ్చే లైట్లను వినియోగించడం, ఇతర కారణాల వల్ల కొన్నిసార్లు తక్కువ విద్యుత్ ను వినియోగించినా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మనం ఇంట్లో ఉపయోగించే తక్కువ ధర ఉన్న ఐసీఎల్ బల్బు విద్యుత్ వినియోగం సంవత్సరానికి 72 యూనిట్లు ఉంటుంది. ఒక బల్బుకు సంవత్సరానికి 264 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సీ.ఎఫ్.ఎల్ బల్బుకు సంవత్సరానికి 18 యూనిట్ల విద్యుత్ అవసరం కాగా 66 రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్.ఈ.డీ బల్బులు మాత్రం సంవత్సరానికి కేవలం 11 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
ఎల్.ఈ.డీ బల్బులకు విద్యుత్ ఛార్జీలు ఏడాదికి 40 రూపాయలుగా ఉంటాయి. ఎక్కువగా ఎల్.ఈ.డీ బల్బులను వినియోగిస్తే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఏసీలను 26 డిగ్రీల దగ్గర వినియోగించడం వల్ల కూడా కరెంట్ బిల్లులను ఆదా చేయవచ్చు. ఫ్రిజ్ లకు ఉన్న స్టార్ రేటింగ్ ను బట్టి విద్యుత్ వినియోగం అంతకంతకూ తగ్గుతుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…