Tag Archives: Redfort

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!

ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరికొద్ది గంటల్లో ఎర్రకోట నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జాతినుద్దేశించి ప్రసంగించిన ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా ఏడో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం విశేషం.

కాగా స్వతంత్ర భారతంలో మొదటిసారిగా జాతీయ పతాకం ఆవిష్కరించిన వెంటనే.. వింగ్ కమాండర్ బల్దేవ్ సింగ్ నేతృత్వంలోని వైమానిక దళం రెండు విమానాల ద్వారా పూల వర్షం కురిపించనుంది.

ఇక టోక్యో ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తో పాటు 32 మంది ఒలంపిక్ విజేతలు మొదటిసారిగా ఎర్రకోట వేడుకలో పాల్గొనున్నారు.